News May 18, 2024

హత్నూర: బైక్‌ను ఢీ కొట్టిన డీసీఎం.. వ్యక్తి మృతి

image

హత్నూర మండలం సిరిపుర గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రియా తాండకు చెందిన గుగులోత్ పప్యా తన బైక్‌పై పని నిమిత్తం సంగారెడ్డికి వెళ్తుండగా, సిరిపురం గ్రామ శివారులో వెనక నుండి వచ్చిన డీసీఎం బైకును ఢీ కొట్టింది. దీంతో పప్యా తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య శ్యామల ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News October 4, 2024

సిద్దిపేటలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

సిద్దిపేట పట్టణం శివాజీ నగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచార నడిపిస్తున్నారని సమాచారంతో సిద్దిపేట టాస్క్ ఫోర్స్, వన్ టౌన్ పోలీసుల దాడి చేశారు. ఈ దాడిలో నలుగురి విటులు, ఓ మహిళను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 వేల నగదు, 6 సెల్ ఫోన్స్, ఓ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.

News October 4, 2024

MDK: మొదలైన సందడి.. నామినేటెడ్ ఆశలు?

image

మెదక్ జిల్లాలో ప్రస్తుతం గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, దేవాదాయ శాఖ, మార్కెట్ కమిటీ, ఆత్మ కమిటీ పాలక మండళ్లు ఖాళీగా ఉన్నాయి. మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, మంత్రి దామోదర్ రాజనరసింహ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పదవులు భర్తీ గురించి చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతో జిల్లాలోని ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

News October 4, 2024

మెదక్: పెరిగిన ధరలు సామాన్యుల ఇక్కట్లు

image

ఉమ్మడి మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా కూరగాయల రేట్లు కొండెకాయి. ఈ మేరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా కొనసాగే గ్రామీణ ప్రాంత సంతలో టమాటా కిలో రూ.50 – 80, బీరకాయలు 60 -70, బెండకాయలు 50 – 80, పచ్చి మిర్చి 80 – 100 వరకు ఉంది.