News April 22, 2025

హత్యకు గురైన వడ్డీ వ్యాపారి: రాంబిల్లి సీఐ

image

రాంబిల్లి మండలం చినకలవలాపల్లి గ్రామంలో వడ్డీ వ్యాపారి జల్లి తాతారావు (65) హత్యకు గురయ్యాడు. ఈనెల 20 తేదీ రాత్రి మెడపై నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు రాంబిల్లి సీఐ నర్సింగరావు సోమవారం తెలిపారు. కుటుంబ సభ్యులు రాజమండ్రిలో ఉంటున్నారు. కుమారుడు అప్పలరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Similar News

News April 22, 2025

జగిత్యాల జిల్లాలో మండుతున్న ఎండలు

image

జగిత్యాల జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రాయికల్ మండలంలో 43.8℃ ఉష్ణోగ్రత నమోదైంది. పెగడపల్లి 43.6, వెల్గటూర్ 43.6, భీమారం 43.5, ధర్మపురి 43.5, సారంగాపూర్ 43.4, బుగ్గారం 43.4, కోరుట్ల 43.3, గొల్లపల్లి 43.3, కథలాపూర్ 43.2, మేడిపల్లి 43.2, ఎండపల్లి 42.6, బీర్పూర్ 43.1, మల్లాపూర్ 43.1, మల్యాల 41.5, ఇబ్రహింపట్నం 43, జగిత్యాల రూరల్ 42.7, మెట్‌పల్లి 42.4, జగిత్యాల 42, కొడిమ్యాలలో 41.4℃ ఉష్ణోగ్రత నమోదైంది.

News April 22, 2025

KNR: SU డిగ్రీ పరీక్ష ఫీజు పొడగింపు

image

KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలో జరుగనున్న డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ BSC, BCOM రెగ్యులర్, బాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ కు సంబంధించిన ఫీజు గడువును 25వ తేదీ వరకు పొడగిస్తూ యూనివర్సిటీ అధికారులు రివైజ్డ్ ఫీ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిలో భాగంగా లేట్ ఫీజు రుసుము రూ.300తో ఈ 29 వరకు చెల్లించువచ్చని నోటిఫికేషన్ లో కాగా, SU కి సంబంధించిన డిగ్రీ పరీక్షలు మే లో జరుగనున్నాయి.

News April 22, 2025

ఎల్లారెడ్డిపేట: ఆత్మహత్యాయత్నం.. యువకుడి మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన గడ్డి నరేందర్(28) <<16173915>>నిన్న<<>> రాత్రి ఆత్మహత్యయత్నం చేసుకున్నవిషయం తెలిసిందే. గడ్డి నరేందర్ మండల కేంద్రంలోని ఓ మహిళ తనను వేధింపులకు గురిచేస్తుందని అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని తీవ్ర గాయాలయ్యాడు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

error: Content is protected !!