News September 28, 2024

హత్యాయత్నం కేసులో.. కడప జైలు వార్డెన్‌కు రిమాండ్

image

అత్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన కడప సెంట్రల్ జైలు వార్డెన్ మహేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని తుళ్లూరు సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. కాకినాడకు చెందిన హైకోర్టు ఉద్యోగి భువనేశ్వరికి మహేశ్‌తో ఏప్రిల్‌లో పెళ్లి కాగా.. వీరు గుంటూరు జిల్లా రాయపూడిలో అద్దెకుంటున్నారు. ఆగస్టు 22న మహశ్ తన అత్త సాయికుమారిపై దాడిచేసి, హత్య చేసేందుకు ప్రయత్నించాడన్నారు.

Similar News

News October 10, 2024

కడపలో వారిపై డ్రోన్ కెమెరాలతో నిఘా

image

గంజాయి నిర్మూలనకు కడప జిల్లా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో గంజాయి కట్టడికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. కడప నగరంలో గంజాయి తాగే ప్రాంతాల్ల ఇకపై డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టనున్నారు. ఇలా ఎవరైనా ఈ కెమెరా కంటపడితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే నగరంలోని కొన్ని కొరియర్ ఆఫీసుల్లో పోలీసులు తనిఖీలు చేశారు.

News October 10, 2024

ఎగ్జిబిషన్‌లు సృజనాత్మక ఆలోచనలను చిగురింపజేస్తాయి: కడప కలెక్టర్

image

పిల్లల్లో సృజనాత్మక ఆలోచనలు చిగురింపజేయడానికి స్పేస్ వీక్- 24 లాంటి ఎగ్జిబిషన్‌లు ఎంతో దోహదపడుతాయని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కడప నగర సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఇస్రో, ఇతర విద్యా సంస్థలు నిర్వహించిన ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమానికి బుధవారం కలెక్టర్ హాజరయ్యారు. వివిధ అంశాలపై జరిగిన కాంపిటీషన్స్ విజేతలకు ఆయన జ్ఞాపికలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

News October 9, 2024

ముద్దనూరు వద్ద రైలు ఢీ.. యువకుడు మృతి

image

రైలు కిందపడి యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం ముద్దనూరులో చోటుచేసుకుంది. ఎర్రగుంట్ల రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ రామిరెడ్డి వివరాల ప్రకారం.. ముద్దనూరు మండలంలోని చింతకుంట సమీపంలో రైలు కిందపడి గుండి నాగేంద్ర (22) మృతి చెందాడు. ఇతను డ్రైవర్‌‌గా జీవనం సాగిస్తారన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల విరాలు తెలియాల్సిఉంది.