News February 25, 2025

హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మామునూరు భాస్కర్(46)ను అతడి కొడుకు‌ అరుణ్(22) కత్తితో పొడిచాడు. భాస్కర్‌ను హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో చనిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 25, 2026

పాకిస్థానీల బెదిరింపులు.. లండన్‌లో ఇండియన్ రెస్టారెంట్ బంద్!

image

లండన్‌లో 16 ఏళ్లుగా భారతీయ వంటకాలను వడ్డిస్తున్న ‘రంగ్‌రేజ్’ రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు దాని ఓనర్ హర్మన్ సింగ్ కపూర్ ప్రకటించారు. పాకిస్థానీల నుంచి ఎదురవుతున్న దాడులు, ఆన్‌లైన్ వేధింపులు, పోలీసుల నుంచి సరైన మద్దతు లభించకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఆరోపించారు. ఖలిస్థాన్ ఉద్యమాన్ని విమర్శిస్తూ SMలో వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి కపూర్ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం.

News February 25, 2026

‘కేరళం’ సరే.. ప్రాజెక్టులేవీ: శశి థరూర్

image

కేరళ పేరును ‘కేరళం’గా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై MP శశి థరూర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మలయాళంలో ఇప్పటికే కేరళం అనే పిలుస్తారని, ఇప్పుడు ఆ పదాన్ని ఇంగ్లీషులోకి తీసుకురావడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. పేరు మార్పుపై చూపిస్తున్న శ్రద్ధను రాష్ట్ర అభివృద్ధిపై చూపడం లేదని విమర్శించారు. బడ్జెట్‌లో కేరళకు ఒక్క కొత్త ప్రాజెక్టూ ఇవ్వలేదని, AIIMS వంటి కీలక సంస్థలను కేటాయించలేదని ఆరోపించారు.

News February 25, 2026

గుంటూరు వన్ స్టాప్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

గుంటూరు జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ వన్ స్టాప్ సెంటర్‌లో 14 కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు. అడ్మినిస్ట్రేటర్, కేసు వర్కర్, కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, సెక్యూరిటీ తదితర ఖాళీలున్నాయి. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు స్వశక్తి భవన్‌ను సంప్రదించాలన్నారు.