News February 25, 2025
హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మామునూరు భాస్కర్(46)ను అతడి కొడుకు అరుణ్(22) కత్తితో పొడిచాడు. భాస్కర్ను హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో చనిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 26, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్..

*KMR: శాసన మండలి ఎన్నికలకు సర్వం సిద్ధం..!
*94 మంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగం@ KMR
* MLC ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: KMR ఎస్పీ
*పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: KMR కలెక్టర్
*మైనర్లకు కల్లు విక్రయించొద్దు: కామారెడ్డి ASP
*వచ్చే నేల 8 న లోక్ అదాలత్..
* మహాశివరాత్రికి ముస్తాబైన ఆలయాలు..
* శివరాత్రి..జోరుగా పండ్ల విక్రయాలు
* పది పరీక్షలు ఎంత మంది రాయనున్నారంటే..?
News February 26, 2025
195 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ కోసం 255 మంది దరఖాస్తు చేసుకోగా 195 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా కలెక్టరేట్లో ఓటరు సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరిపామన్నారు.
News February 26, 2025
విశాఖ రైల్వే స్టేషన్లో DRM ఆకస్మిక తనిఖీ

వాల్తేరు DRM లలిత్ బోహ్రా మంగళవారం మొదటి సారిగా విశాఖ రైల్వే స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో పరిశుభ్రత, కోచ్ నిర్వహణ సమస్యలు, రద్దీ, భద్రతకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. జనరల్ బుకింగ్ ఆఫీస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, క్యాటరింగ్ స్టాల్స్ మొదలైన వాటిని పరిశీలించారు. స్టేషన్లో పురోగతిలో ఉన్న పనులను సీనియర్ అధికారులతో సమీక్షించారు.