News November 28, 2025

హనుమకొండ: తొలి రోజు నామినేషన్లు ఎన్నంటే..?

image

హనుమకొండ జిల్లాలో 86 సర్పంచ్‌ స్థానాలకు, 61 వార్డు మెంబర్ స్థానాలకు ఈరోజు నామినేషన్లు దాఖలు అయ్యాయి. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడత నామినేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా ఇందుకు సంబంధించి భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండల పరిధిలో 86, వార్డు సభ్యుల స్థానాలకు 61 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. నామినేషన్ ప్రక్రియ మరో 2 రోజులు కొనసాగుతుందన్నారు.

Similar News

News November 28, 2025

నేడు కామారెడ్డికి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న PDSU 23వ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హాజరుకానున్నారు. PDSU జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లాలోని పీడీఎస్‌యూ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై, మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

News November 28, 2025

అమలాపురం: 22 మందికి డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 22 మండలాలకు డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తూ కలెక్టర్ మహేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా సచివాలయ పరిపాలన పర్యవేక్షణకు ఈ నియామకాలు చేపట్టారు. గ్రామ పంచాయతీల్లోని సీనియర్ గ్రేడ్-1 కార్యదర్శులకు, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించి డిప్యూటీ ఎంపీడీవోలుగా అవకాశం కల్పించారు.

News November 28, 2025

సికిల్‌సెల్, తలసేమియా రోగుల కోసం ప్రత్యేక శిబిరాలు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సికిల్‌సెల్, తలసేమియా దీర్ఘకాలిక రక్త వ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరాలను ఈ నెల 29న (శనివారం) ఉదయం 8 గంటలకు అశ్వారావుపేటలో, మధ్యాహ్నం 12:30 గంటలకు నారాయణపురంలోని రైతు వేదికల్లో నిర్వహించనున్నారు.. రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.