News September 6, 2025

హనుమకొండ: మహిళల ఆర్థిక అభివృద్ధికి గణనీయమైన కృషి: MP

image

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి గణనీయమైన కృషి చేస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. గోవా రాష్ట్రంలో నిర్వహించిన సెమినార్‌లో ఎంపీ కావ్య పాల్గొని మహిళలు డిజిటల్ ప్రపంచంలో ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళల శక్తి వృద్ధికి అవసరమైన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Similar News

News September 7, 2025

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.117, మాంసం రూ.170 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.193 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.210 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News September 7, 2025

చంద్రగ్రహణం.. ఒంటిమిట్ట ఆలయం మూసివేత

image

ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం ఆలయాన్ని మూసివేయనున్నారు. అలాగే కడప జిల్లాలోని పలు ఆలయాలు పొలతల మల్లేశ్వరస్వామి, పులివెందులలోని వెంకటేశ్వర స్వామి, మిట్ట మల్లేశ్వరస్వామి, రంగనాథస్వామి ఆలయం, గండి వీరాంజనేయస్వామి ఆలయం, నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయం మూసివేయనున్నట్లు గండి EO వెంకటసుబ్బయ్య తెలిపారు.

News September 7, 2025

రూ.350 కోట్లతో భద్రాచలం రాములోరి ఆలయాభివృద్ధి

image

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధికి దేవాదాయ శాఖ రూ.350 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఆలయ పరిసరాలను 4 విడతల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. తొలి విడతగా రూ.115 కోట్లతో ఆలయ కాంప్లెక్స్ తదితర అభివృద్ధి, రెండో విడత రూ.35 కోట్లతో రోడ్లు కాంప్లెక్స్, అడ్మిన్ బ్లాక్, మూడో విడతలో రూ.100 కోట్లతో పార్కులు, నాలుగో విడతలో రూ.100 కోట్లతో హోటల్ తదితర పనులు చేపట్టనున్నారు.