News July 9, 2025
హనుమకొండ: వడ్ల బస్తాల లోడ్ లారీ దగ్ధం

వడ్ల బస్తాల లోడ్తో ఉన్న లారీ దగ్ధమైన ఘటన హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం ఎల్లాపూర్ దగ్గర ఈరోజు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కరీంనగర్ నుంచి హనుమకొండ వైపు వడ్ల బస్తాల లోడ్తో వస్తున్న ఓ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైంది. డ్రైవర్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని బయట పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మంటలు ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News July 9, 2025
జాతీయ అవార్డుకు ధర్మవరం డిజైనర్ ఎంపిక

ధర్మవరం పట్టణానికి చెందిన ప్రముఖ చేనేత డిజైనర్ నాగరాజు జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషన్ ప్రకటించిన డిజైన్ డెవలప్మెంట్ మార్కెటింగ్ అవార్డులకు గాను తనను ఎంపిక చేశారని నాగరాజు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు పేర్కొన్నారు.
News July 9, 2025
దర్శకుడితో సమంత మరో టూర్.. ఫొటోలు వైరల్

స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి మరోసారి విదేశాల్లో పర్యటించారు. అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో పర్యటించిన ఫొటోలను ఆమె ఇన్స్టాలో షేర్ చేశారు. ఇప్పటికే వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని ప్రచారం జరుగుతుండగా దీంతో మరింత ఊపందుకుంది. అయితే దీనిపై ఇప్పటివరకు సమంత గానీ, రాజ్గానీ ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం. గతంలో వీరిద్దరు <<16638854>>దుబాయ్లో<<>> పర్యటించారు.
News July 9, 2025
కొత్తపల్లిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ గోండుగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి అను ఉరివేసుకొని మంగళవారం మృతి చెందింది. మోతుగూడెం ఎస్సై కథనం మేరకు.. కొత్తపల్లి పంచాయతీ గొందిగూడెం గ్రామానికి చెందిన MLT విద్యార్థిని రోజు మాదిరిగానే రంపచోడవరం కాలేజీకి వెళ్లి తిరిగి వచ్చింది. అనంతరం వారి పొలానికి వెళ్లి చెట్టుకు చున్నీతో ఉరి వేసుకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.