News July 10, 2025

హనుమకొండ: సజ్జనార్ సార్.. ఆర్టీసీలో కుర్చీలే లేవా…!

image

హనుమకొండలోని ఆర్టీసీ కార్యాలయంలో కుర్చీల కొరతతో సిబ్బంది అవస్థలు పడుతున్నారు. బస్ పాస్ కౌంటర్ల దగ్గర పని చేసే సిబ్బందికి కూర్చునేందుకు సరైన కుర్చీలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇనుప రాడ్‌తో ఉన్న స్టూల్‌కు ప్లాస్టిక్ కుర్చీ జత చేయడంతో సిబ్బంది అసౌకర్యంగా కూర్చుంటున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని సిబ్బంది కోరుతున్నారు.

Similar News

News July 10, 2025

భధ్రాద్రి: ఉరేసుకుని మహిళ SUICIDE

image

దమ్మపేట మండలం గండుగులపల్లికి కృపా అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఏడుకొండలు కొమ్ముగూడెంకు చెందిన కృపా(19)ను వివాహం జరిగింది. కొంతకాలంగా ఏడుకొండలు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్య కృపను వరకట్నం కోసం వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైనా ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి కేసు నమోదు చేశారు.

News July 10, 2025

8th పే కమిషన్: భారీగా పెరగనున్న జీతాలు!

image

8th పే కమిషన్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇది అమలైతే జీతాలు, పెన్షన్లు 30-34% పెరుగుతాయని Ambit Capital(ఫైనాన్షియల్ అడ్వైజర్) అంచనా వేసింది. 44లక్షల మంది ఉద్యోగులు, 68లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది. బేసిక్ పే, అలవెన్సులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరుగుతాయంది. కాగా కొత్త పే స్కేల్ 2026 JAN నుంచి అమలవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు.

News July 10, 2025

నంద్యాల జిల్లాలో 3.14 లక్షల మంది: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలోని 1,959 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 3.14 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. వెలుగోడులో ఆమె మాట్లాడుతూ.. మన ఎదుగుదలను కోరుకునేది మన గురువులేనన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగేలా తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేయాలన్నారు.