News September 23, 2025
హన్మకొండ: పచ్చదనం విరిసి.. అవని మురిసి..!

అందమైన ప్రకృతి అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. చుట్టూ పంట పొలాలు, వాటి మధ్యలో గుట్టలు, ఎత్తైన తాటి చెట్లు, పంట పొలాల్లో పని చేస్తున్న రైతన్నలు, గొర్రెలను మేపుతున్న కాపరులు. ఇవన్నీ ఒకే చోట ఉంటే చూడటానికి రెండు కళ్లు సరిపోవనే చెప్పవచ్చు. అలాంటి దృశ్యం మన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లి గ్రామ శివారులోని ఇనుపరాతి గుట్టల వద్ద కనివిందు చేస్తోంది. అచ్చం ఓ చిత్రకారుడు గీసిన చిత్రలాగే ఉంది.
Similar News
News September 23, 2025
MDK: గూగుల్ మ్యాప్ నమ్ముకొని ఇరుక్కుపోయాడు

మెదక్ జిల్లాలో గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రయాణించిన డీసీఎం డ్రైవర్ ఇబ్బందుల్లో పడ్డాడు. ఆదివారం వైజాగ్ నుంచి వడియారం మహావీర్ పేపర్ పరిశ్రమకు వచ్చిన డీసీఎం.. గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్లగా కుంట కట్టవైపు చూపించింది. ముందుకు వెళ్లగా రైల్వే ట్రాక్ అడ్డు రావడంతో వెనుకకు రివర్స్లో వస్తుండగా కట్టపై గుంతలో డీసీఎం ఊరుకుపోయింది. క్రేన్ సహాయంతో డీసీఎంను బయటకు తీశారు.
News September 23, 2025
విజయవాడ శాసనసభా ప్రాంగణంలో మహిళా MLAలు

అనంతపురం జిల్లా మహిళా MLAలు AP అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. రాప్తాడు MLA పరిటాల, పుట్టపర్తి MLA పల్లె సింధూర రెడ్డి, మంత్రి సవిత శాసనసభ ప్రాంగణంలో జ్ఞాపకంగా ఫోటో తీసుకున్నారు. శింగనమల నియోజకవర్గం MLA బండారు శ్రావణి శ్రీ మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.
News September 23, 2025
ఖానాపూర్: గోదావరికి పోటెత్తిన వరద

ఎస్సారెస్పీకి వచ్చిన వరదను దిగువకు వదలడంతో ఖానాపూర్, కడెం, మామడ మండలాల పరిధిలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం ఎస్సారెస్పీ 40 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో వరద ప్రవాహం మరింత పెరిగింది. ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు నదివైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.