News April 13, 2025
హఫీజ్ ఖాన్కు వైఎస్ జగన్ కీలక పదవి!

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలకు చోటు దక్కింది. మాజీ మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్కు ఆ కమిటీలో చోటు కల్పిస్తూ వైసీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్గా మొత్తం 33 మందితో ఈ కమిటీని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. కమిటీలోని సభ్యులు జగన్కు రాజకీయ సలహాలు ఇవ్వనున్నారు.
Similar News
News April 15, 2025
కర్నూలులో మెరుగైన వైద్యం అందిచాలి: మంత్రి భరత్

కర్నూలు సర్వజన ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యంతోపాటు, సౌకర్యాలు కూడా కల్పించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు గౌరు చరిత, దస్తగిరిలు హాజరయ్యారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
News April 14, 2025
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: కర్నూలు కలెక్టర్

వెల్దుర్తి బాలుర వసతి గృహంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎమ్మార్వో, ఆర్డీవో, వార్డెన్ తదితరులు పాల్గొన్నారు.
News April 14, 2025
కర్నూలులో నేడు PGRS రద్దు

కర్నూలులో నేడు నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేశామని వివరించారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మరోవైపు ఎస్పీ కార్యాలయంలోనూ ఈ కార్యక్రమం జరగదని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.