News February 10, 2025
హరీశ్ రావు లేఖకు కేంద్ర మంత్రి స్పందన

సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నంగునూరు మండలం రాజగోపాల్ పేట గ్రామంలో సెంట్రల్ లైటింగ్, ఫుట్ పాత్, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కారికి మాజీ మంత్రి, MLA హరీశ్ రావు ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన గడ్కారీ తిరిగి లేఖ రాస్తూ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మీరు కోరిన పనుల ఏర్పాటుకు అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. దీంతో హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News March 2, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 2, 2026
NZB: వాలీబాల్ తగిలి ఇరువర్గాల మధ్య ఘర్షణ

నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తండాలో వాలీబాల్ కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. ఫిబ్రవరి 27న తండాకు చెందిన కొందరు యువకులు వాలీబాల్ ఆడుతుండగా విక్రమ్ వాలీబాల్ను కొట్టగా అక్కడే ఉన్న బుజ్జి బాయి అనే వృద్ధురాలికి తగిలింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఆదివారం ఇరువర్గాల వారు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
News March 2, 2026
యూఏఈపై ఇరాన్ దాడులు.. ఖండించిన ప్రధాని మోదీ

అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతీకార దాడుల్లో భాగంగా ఇరాన్ యూఏఈపై విరుచుకుపడటాన్ని ప్రధాని మోదీ తప్పుపట్టారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన మోదీ.. యూఏఈకి భారత్ అండగా ఉంటుందని తెలిపారు. అక్కడి పరిస్థితిపై యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్తో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో అక్కడి భారతీయులు క్షేమంగా ఉండేందుకు UAE చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు.


