News August 5, 2024
హాట్ సీటుగా కొమురవెల్లి ఆలయ ఛైర్మన్ పదవి

కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్, డైరెక్టర్ల పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. యాదవ సామాజిక వర్గం ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లన్న ఆలయ పాలక మండలి ఛైర్మన్ పదవిని అదే సామాజిక వర్గానికి కేటాయించాలని దేవాలయ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ప్రస్తావించారు. ఛైర్మన్ పదవికి 8 మండలాల నుంచి 22 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
Similar News
News January 7, 2026
జూనియర్ కాలేజీలకు డిజిటల్ టీవీలు: వరంగల్ DIEO

వరంగల్ జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు డిజిటల్ టీవీలు పంపిణీ చేసినట్లు DIEO డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య ఆదేశానుసారం అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిజిటల్ బోధనకు ఉపకరించే సామాగ్రి అందించినట్లు వెల్లడించారు. నేడు గీసుకొండ కళాశాలకు అందించామన్నారు. ఒక్కో కళాశాలకు రూ.6లక్షలకు పైగా విలువైన డిజిటల్ సామాగ్రి పంపిణీ చేశారన్నారు.
News January 7, 2026
WGL మార్కెట్లో చిరుధాన్యాల ధరల్లో స్వల్ప తేడాలు

వరంగల్ ఎనుమాముల మార్కెట్కి బుధవారం చిరుధాన్యాలు తరలిరాగా, ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకి నిన్న రూ.8,850 ధర రాగా..ఈరోజు రూ.8,700కి తగ్గింది. అలాగే పచ్చి పల్లికాయకి మంగళవారం రూ.5,500 ధర వస్తే.. నేడు రూ.5,970 అయింది. క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,080 పలికితే.. నేడు రూ.2,060 పలికింది. దీపిక రకం మిర్చికి మంగళవారం రూ. 16,500 ధర ఉంటే..ఈరోజు రూ.17,500 అయినట్లు వ్యాపారులు తెలిపారు.
News January 7, 2026
జిల్లాల పునర్విభజన: ఓరుగల్లులో మళ్లీ హాట్ టాపిక్!

జిల్లాల విభజన అంశం మళ్లీ తెరపైకి రావడంతో వరంగల్ వాసుల్లో ఉత్కంఠ పెరిగింది. గత ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ను 6 జిల్లాలుగా విభజించిందన్న విమర్శల నేపథ్యంలో, ప్రభుత్వం శాసనసభలో పునర్విభజన ప్రకటన చేయడం కొత్త చర్చకు దారితీసింది. వరంగల్-హనుమకొండ విలీనంపై స్పష్టత వస్తుందా? ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పరిధులు ఎలా మారతాయి? అనే ఆసక్తి నెలకొంది. సరిహద్దులు మారకుండా చూసే అవకాశం ఉందో చూడాల్సి ఉంది.


