News April 14, 2025

హిందూపురం: ఇండో పాక్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుడు ఇకలేరు

image

1971లో ఇండో పాక్ యుద్ధంలో పాల్గొన్న హిందూపురం పట్టణవాసి ఆదినారాయణ సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. భారత సైన్యంలో 24ఏళ్ళు వివిధ క్యాడర్లలో దేశ సేవ చేసిన ఆదినారాయణ మరణం పట్ల పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తాను చిన్ననాటి నుంచే ధైర్య సాహసాలను ప్రదర్శించేవాడని, తాను దేశ సేవ కోసం మిలటరీలో చేరినట్లు చెప్పేవాడని మాజీ సైనికులు పేర్కొన్నారు.

Similar News

News November 5, 2025

గుంటూరు: ‘ప్రైవేట్ కాలేజీల నిర్లక్ష్యంపై చర్యలేవి’

image

రాజధాని అమరావతిలోని ప్రైవేట్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలలో నిల్వ ఉంచిన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టడంతో విద్యార్థుల ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. రాజధానిలో ప్రైవేట్ కాలేజీల నిర్లక్ష్యంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

News November 5, 2025

OFFICIAL: కమల్ ప్రొడక్షన్‌లో రజినీ సినిమా

image

తమిళ సినీ దిగ్గజాలు రజినీకాంత్, కమల్ హాసన్ ఓ సినిమా కోసం చేతులు కలిపారు. కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో రజినీకాంత్ హీరోగా ఈ మూవీ తెరకెక్కనుంది. దీనికి సి.సుందర్ దర్శకత్వం వహించనున్నారు. సూపర్ స్టార్‌కు 173వ సినిమా ఇది. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు కమల్ హాసన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

News November 5, 2025

గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం: కలెక్టర్

image

రేపు నిర్వహించే గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం యథావిధిగా ఉంటుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రజలు, ఉద్యోగుల సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తామని కలెక్టర్ బుధవారం పేర్కొన్నారు. జిల్లా ప్రజలు నేరుగా కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు ఇవ్వొచ్చని తెలిపారు.