News February 16, 2025

హిందూపురం ఎక్సైజ్ సీఐగా లక్ష్మీ దుర్గయ్య బాధ్యతల స్వీకరణ

image

హిందూపురం ఎక్సైజ్ సీఐగా లక్ష్మీ దుర్గయ్య ఆదివారం బాధ్యతలు చేపట్టారు. 2 నెలల క్రితం ఎక్సైజ్ సీఐని కొన్ని అనివార్య కారణాల వల్ల ఉన్నతాధికారులు బదిలీ చేశారు. విచారణ తర్వాత లక్ష్మీ దుర్గయ్య ఎక్సైజ్ సీఐగా కచ్చితత్వం కలిగిన అధికారిగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో గతంలో పనిచేసిన హిందూపురం స్థానానికే ఆయనను బదిలీ చేశారు.

Similar News

News February 28, 2026

ఈనాటి ముఖ్యాంశాలు

image

➤ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌, కవితకు క్లీన్‌చిట్
➤ కాంగ్రెస్ నిరసనలకే పరిమితమైంది: PM మోదీ
➤ తమిళ హీరో విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన భార్య సంగీత
➤ కూటమి పాలనలో నీరు, పాలూ ప్రాణాంతకమే: జగన్
➤ ఇళ్లు రాని వాళ్లంతా అప్లై చేసుకోవాలి: CBN
➤ కవితకు న్యాయం జరిగింది: కేటీఆర్
➤ ₹47,776 CRతో AP అక్రమ ప్రాజెక్టులు: TG
➤ భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు.. ₹5లక్షల కోట్లు ఆవిరి!

News February 28, 2026

రెడ్‌బుక్‌లో జగన్ పేరు ఉందా? లోకేశ్ ఏమన్నారంటే..

image

AP: YCP హయాంలో తమ కార్యకర్తలు, ప్రజలపై తప్పుడు కేసులు పెట్టిన వారి పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నాయని లోకేశ్ తెలిపారు. ‘లా బ్రేక్ చేసిన, అందుకు ప్రేరేపించిన నేతలు, టార్చర్ చేసినవాళ్ల పేర్లు ఉంటాయి. జగన్ పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుంది. అటు SMలో 16ఏళ్ల లోపువారికి ఏజ్ అప్రాప్రియేట్ కంటెంటే కనిపించాలి. దీనిపై ఫ్రేమ్‌వర్క్‌కు కసరత్తు చేస్తున్నాం’ అని ముంబైలో జరిగిన ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సులో అన్నారు.

News February 28, 2026

WI చేతిలో 3 సార్లు హార్ట్ బ్రేక్.. ఈసారి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే!

image

T20WC-2026లో భారత్ సెమీస్ చేరాలంటే మార్చి 1న కచ్చితంగా వెస్టిండీస్‌ను ఓడించి తీరాల్సిందే. అయితే పొట్టి ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు 4 సార్లు తలపడ్డాయి. మూడింట్లో విండీస్ గెలవగా, టీమ్ ఇండియా ఒకసారి మాత్రమే విజయం సాధించింది. 2009, 10లో సూపర్-8 దశలో, 2016లో సెమీఫైనల్లో ఓడించి భారత అభిమానుల హార్ట్ బ్రేక్ చేసింది. ఈసారి కూడా ఆ జట్టు బలంగా ఉంది. మరి WIను ఓడించాలంటే సూర్య సేన విజృంభించాల్సిందే.