News March 9, 2025

హిందూపురం: చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

image

హిందూపురంలోని ఆటోనగర్‌లో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 2- టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయాన్(14), హరిహన్(12) ఇద్దరు ఆటో నగర్‌‌లోని సడ్లపల్లి చెరువులో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు. బందువులు వారిని వెలికితీసి హిందూపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు.

Similar News

News March 10, 2025

CT: అత్యధిక పరుగులు, వికెట్ల వీరులు

image

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర(263) ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. 4 మ్యాచుల్లో రెండు సెంచరీలు చేశారు. ఇక తర్వాతి స్థానాల్లో భారత ప్లేయర్ శ్రేయస్ అయ్యర్(243), బెన్ డకెట్(227), జో రూట్(225) ఉన్నారు. అత్యధిక వికెట్ల జాబితాలో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ(10W), వరుణ్ చక్రవర్తి(9), సాంట్నర్(9), షమీ(9), బ్రేస్ వెల్(8) ఉన్నారు.

News March 10, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 10, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 5.16 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.25 గంటలకు
ఇష: రాత్రి 7.37 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 10, 2025

నల్గొండ: ఎమ్మెల్సీ సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం

image

శాసనమండలి ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఖారారైంది. హైదరాబాద్‌ మఖ్దూం భవన్‌లో ఆదివారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. నెల్లికంటి సత్యం సోమవారం ఉదయం 10గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నెల్లికంటి సత్యం NLG జిల్లా సీపీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

error: Content is protected !!