News April 25, 2024
హిందూపురం పార్లమెంటు నుంచి 6 నామినేషన్లు: కలెక్టర్

హిందూపురం పార్లమెంటు నుంచి బుధవారం ఆరుగురు నామినేషన్లు వేసినట్టు సత్యసాయి జిల్లా రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. ఆర్ఎస్పీ పార్టీ నుంచి ఏ.శ్రీనివాసులు, నేషనల్ నవ క్రాంతి నుంచి ధనుంజయ బూదిలి, స్వతంత్ర అభ్యర్థిగా కుల్లాయప్ప, కాంగ్రెస్ పార్టీ నుంచి షాహిన్, వైసీపీ నుంచి శాంత, బీఎస్పీ నుంచి భాగ్య నామినేషన్లు వేసినట్టు ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 23, 2025
నేడే రిజల్ట్.. అనంతపురం జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అనంతపురం జిల్లాలో 32,803 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 23, 2025
పథకాల అమలు పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్ డా.వినోద్ కుమార్

ప్రభుత్వ పథకాలు, వివిధ సేవలను పారదర్శకంగా ప్రజలకు అందించాలని, వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురంలోని కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ సేవలపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని తెలిపారు.
News April 22, 2025
ఇంటర్ ఫలితాల్లో అనంతపురం యువతికి 981 మార్కులు

శెట్టూరు మండలం బసంపల్లి గ్రామానికి చెందిన పాలబండ్ల హనుమంతరెడ్డి, పాలబండ్ల కుమారి దంపతుల కుమార్తె శశిలేఖ తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదివిన యువతి ఎంపీసీలో 1000 మార్కులకు గానూ 981 మార్కులు సాధించారు. శశి లేఖని ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు అభినందించారు.