News October 11, 2024
హిందూపురం ప్రభుత్వ టీచర్కు 6 నెలల జైలు శిక్ష
హిందూపురానికి చెందిన ఓ మహిళా ఉపాధ్యాయినికి చెక్ బౌన్స్ కేసులో పెనుకొండ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. పోలీసుల వివరాల మేరకు.. 2022లో గుట్టూరుకు చెందిన ఈశ్వరమ్మకు హిందూపురానికి చెందిన ఓ ఉపాధ్యాయిని డబ్బు ఇవ్వాల్సి ఉండగా చెక్ ఇచ్చింది. అది బౌన్స్ కావడంతో కొంతకాలం తర్వాత ఈశ్వరమ్మ కోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా గురువారం కోర్టు తీర్పు వెల్లడించింది.
Similar News
News October 11, 2024
దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి: కలెక్టర్
చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్కరి కుటుంబానికి విజయాలు వరించాలన్నారు. జిల్లా ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలను మంత్రి తెలిపారు.
News October 10, 2024
ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
కనగాణపల్లి మండలంలోని కేజీబీవి బాలికల పాఠశాలలో ఖాళీగా బోధనేతర ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. పాఠశాలలో హెడ్ కుక్ పోస్టు 1, అసిస్టెంట్ కుక్ 1, చౌకిదర్ పోస్టు 1 ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈనెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.
News October 10, 2024
మైనర్లను పనిలో ఉంచుకోవడం నేరం: ఎస్పీ
మైనర్ పిల్లలను పనులలో ఉంచుకోవడం నేరమని శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రమైన పుట్టపర్తితో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు మోటార్ మెకానిక్ షాపులు, గుజిరి, కిరాణా షాపులను తనిఖీ చేశారు. 14 ఏళ్ల లోపు పిల్లలను దుకాణాలలో పనికి పెట్టుకోరాదని, వారి హక్కులకు భంగం కలిగించుట నేరమని తెలిపారు.