News June 26, 2024
హుజూరాబాద్: అవమానంతో వివాహిత సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719375518551-normal-WIFI.webp)
హుజూరాబాద్ (M) ఇప్పల నర్సింగాపూర్కు చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వివాహిత అదే గ్రామానికి చెందిన నాగరాజుతో సంబంధం పెట్టుకుందని అతడి భార్య ఉమ, సోదరి తిరుమల, రాజ్కుమార్ ఆమెపై దాడి చేశారు. అవమానం భరించలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మంగళవారం సమీపంలోని వ్యవసాయ బావిలో శవమై కనిపించిందని తెలిపారు. కేసు నమోదు చేసినట్లు సీఐ రమేశ్ పేర్కొన్నారు.
Similar News
News June 29, 2024
స్వచ్ఛ కరీంనగర్గా తీర్చిదిద్దుదాం: ప్రఫుల్ దేశాయ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719591565136-normal-WIFI.webp)
కరీంనగర్ను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, (మున్సిపల్ కమీషనర్) ప్రఫుల్ దేశాయ్ పిలుపునిచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల వల్ల ప్రజలు సీజనల్ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నదని జిల్లా ప్రజలందరు అప్రమత్తతతో, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. మన ఇంటి చుట్టు, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం మనందరి బాధ్యత అని సూచించారు.
News June 29, 2024
KNR: విద్యార్థులది గ్రేట్ అచీవ్ మెంట్: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719590523828-normal-WIFI.webp)
ఇటీవల నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 483 మంది విద్యార్థులు ఉండగా 432 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 51 మంది హాజరు కాలేదని చెప్పారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో 432 మంది విద్యార్థుల్లో 418 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. జిల్లాలో 96.76 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు.
News June 29, 2024
సిరిసిల్ల: ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719582337837-normal-WIFI.webp)
సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్లో గల ఈవీఎం గోదామును కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పరిశీలించి, రిజిస్టర్లో సంతకం చేసి అధికారులకు, భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డిఓ రమేష్, తహసీల్దార్ షరీఫ్, ఎన్నికల విభాగం అధికారులు ఉన్నారు.