News March 19, 2024

హుజూరాబాద్: ఏటీఎంలో చోరీ.. కేసు నమోదు

image

హుజూరాబాద్ కోర్టుకు ఎదురుగా ఉన్న SBI ATMలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల ప్రకారం.. చోరీ అనంతరం దుండగులు ఏటీఎంను దహనం చేశారు. ఘటనా స్థలానికి సీఐ బొల్లం రమేశ్ చేరుకుని తన సిబ్బందితో వేలిముద్రలను సేకరించారు. కాగా, చోరీ జరిగిన స్థలాన్ని ఏసీపీ శ్రీనివాస్ సోమవారం పరిశీలించారు. రూ.8,64,100 చోరీకి గురైనట్లు సమాచారం. నెట్‌వర్క్ అసిస్టెంట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Similar News

News April 17, 2025

గన్నేరువరంలో భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన

image

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంలో గురువారం భూ భారతి కొత్త ఆర్.ఓ.ఆర్ చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యకమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీవో మహేశ్వర్ హాజరై మాట్లాడారు. భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం పై రైతులకు అవగాహన కల్పించారు. భూభారతిపై ఎలాంటి సందేహాలు ఉన్న అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News April 17, 2025

కరీంనగర్: డిజిటల్ తరగతులను ప్రారంభించిన కలెక్టర్

image

కరీంనగర్ కశ్మీర్ గడ్డలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి డిజిటల్ తరగతులను ప్రారంభించారు. డిజిటల్ విద్యా బోధనతో విద్యార్థులకు త్వరగా అవగాహన కలుగుతుందన్నారు. ఉపాధ్యాయులు మెలకువలతో పాఠాలను బోధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు అధికంగా వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

News April 17, 2025

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత ఇలా..

image

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 41.0°C నమోదు కాగా, రామడుగు 40.9, జమ్మికుంట 40.8, మానకొండూర్ 40.7, చిగురుమామిడి, తిమ్మాపూర్ 40.3, చొప్పదండి, కరీంనగర్ రూరల్ 40.2, కరీంనగర్, గన్నేరువరం 40.0, శంకరపట్నం, కొత్తపల్లి 39.9, వీణవంక 39.3, హుజూరాబాద్ 38.7, ఇల్లందకుంట 38.6, సైదాపూర్ 38.1°C గా నమోదైంది.

error: Content is protected !!