News December 25, 2025

హుజూర్‌నగర్: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

image

క్రిస్మస్ సందర్భంగా హుజూర్‌నగర్ పట్టణంలోని పలు చర్చిల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. చర్చిలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఎస్సీలు క్రిస్టియన్ మతం స్వీకరిస్తే ఎస్సీ సర్టిఫికెట్, రిజర్వేషన్లు కోల్పోతారన్న అభిప్రాయానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.

Similar News

News December 27, 2025

KNR కమిషనరేట్‌లో రౌడీలు ఎంతమంది ఉన్నారంటే ..?

image

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2024లో 578 హిస్టరీ షీట్స్ ఓపెన్ కాగా.. 2025లో 575 కేసులు నమోదు చేశారు. ఈ సంవత్సరం కొత్తగా 20 మందిపై కొత్తగా రౌడీ షీట్లు తెరవగా.. 362 సస్పెక్టెడ్ కేసులుగా నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే రౌడీల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తరచుగా సీపీ గౌస్ ఆలం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తూ శాంతి భద్రతలను కంట్రోల్‌లో ఉంచుతున్నారు.

News December 27, 2025

తిరుమల: 29 నుంచి 8 వరకు టోకెన్లు ఉండవు

image

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల నేపథ్యంలో TTD కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు తిరుపతిలో జారీ చేసి SSD టోకెన్లు డిసెంబర్ 29 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిలిపివేసింది. 28 ఆదివారం దర్శన టికెట్లు శనివారం ఉదయమే జారీ చేశారు. 29 సోమవారానికి ఇచ్చే టికెట్లు జారీ చేయరు. తిరిగి జనవరి 9వ తేదీకి సంబంధించిన టోకెన్లు 8వ తేదీ జారీ చేయనున్నారు.

News December 27, 2025

రామగిరి ఖిల్లాకు టూరిజం కళ

image

పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లాను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనుంది. ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావంతో ఉన్న ఈ ప్రాంతం ఇక టూరిస్ట్ స్పాట్‌గా మారబోతోంది. అటవీ శాఖకు రూ.1.14 కోట్లు, టూరిజం శాఖకు రూ.3.86 కోట్లు కేటాయించి పర్వతమాల ప్రాజెక్ట్ కింద రోప్‌వే ఏర్పాటు చేయనున్నారు. ఈ అభివృద్ధి పనులతో పరిసర గ్రామాలకు ఉపాధి అవకాశాలు పెరిగి, ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఊతం లభించనుంది.