News October 23, 2025

హుజూర్‌నగర్ జాబ్ మేళా ఏర్పాట్లు పరిశీలన

image

ఈ నెల 25న హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ సారథ్యంలో జరగనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లను కలెక్టర్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో కలిసి వారు ఏర్పాట్లను సమీక్షించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మార్కెట్ ఛైర్మన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Similar News

News October 23, 2025

ఓయూ ఎంబీఏ పరీక్షల ఫీజు స్వీకరణ

image

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షల ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ నాలుగో సెమిస్టర్ మేకప్, ఇన్‌స్టంట్ పరీక్షా ఫీజును ఈనెల 30వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.800 అపరాధ రుసుముతో వచ్చే నెల 3వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు.

News October 23, 2025

గుంటూరులో పురాతన అగస్త్యేశ్వరస్వామి ఆలయం

image

గుంటూరు RTC బస్ స్టాండ్‌కు సమీపంలో అగస్త్యేశ్వరస్వామి ఆలయం అత్యంత పురాతనమైనది. చాళుక్యుల సామంతులైన పరిచ్ఛేద వంశానికి చెందిన పండయ్యరాజు దీనిని 12వ శతాబ్దంలో నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఈ శివలింగాన్ని వేలాది సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి ప్రతిష్టించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ చతురస్రాకారంలో శివలింగం దర్శనమిస్తుంది. ఆలయ ముఖ మండప స్తంభాలు చాళుక్యుల శిల్పకళా వైభవానికి నిదర్శనం.

News October 23, 2025

ఓయూ ఎంబీఏ పరీక్షల ఫీజు స్వీకరణ

image

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షల ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ నాలుగో సెమిస్టర్ మేకప్, ఇన్‌స్టంట్ పరీక్షా ఫీజును ఈనెల 30వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.800 అపరాధ రుసుముతో వచ్చే నెల 3వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు.