News December 20, 2025

హుజూర్‌నగర్: సర్పంచ్‌లకు నేడు మంత్రి ఉత్తమ్ సన్మానం

image

నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచులు, వార్డు మెంబర్లకు నిర్వహించనున్న హుజూర్‌నగర్ నియోజకవర్గ సన్మాన కార్యక్రమం మార్పు చేశామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నేడు (డిసెంబర్ 20) సా.4 గంటలకు హుజూర్‌నగర్ పట్టణంలోని కౌండన్య ఫంక్షన్ హాల్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులు, వార్డు మెంబర్లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.

Similar News

News December 20, 2025

గుజరాత్‌లో SIR.. 73 లక్షల ఓట్లు తొలగింపు

image

గుజరాత్‌లో నిర్వహించిన SIRలో 73,73,327 ఓట్లను అధికారులు తొలగించారు. మొత్తం ఓటర్ల సంఖ్య 5.08 కోట్ల నుంచి 43.47 కోట్లకు తగ్గిందని డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ ద్వారా తెలుస్తోంది. అభ్యంతరాలను జనవరి 18, 2026లోగా తెలియజేయాలి. వాటిని ఫిబ్రవరి 10లోగా అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారు. తొలగించిన ఓట్లలో 18 లక్షల మంది మరణించిన వారివి కాగా శాశ్వతంగా నివాసం మారిన ఓట్లు 40 లక్షలుగా గుర్తించారు.

News December 20, 2025

T20ల్లో తిరుగులేని జట్టుగా టీమ్‌ఇండియా!

image

టీ20 సిరీసుల్లో భారత్ జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా SAపై సిరీస్ గెలుపుతో IND వరుసగా 8వ ద్వైపాక్షిక T20 సిరీస్‌‌ను సొంతం చేసుకుంది. 2023 డిసెంబర్ నుంచి ఇది కొనసాగుతోంది. మొత్తంగా భారత్‌ వరుసగా 14 సిరీస్‌లు(ద్వైపాక్షిక+ టోర్నమెంట్లు) గెలిచింది. ఇందులో 2023 ఏషియన్ గేమ్స్, 2024 T20 వరల్డ్ కప్, 2025 ఆసియా కప్ కూడా ఉన్నాయి. టీమ్ఇండియా చివరిసారి 2023 ఆగస్టులో WIపై 3-2 తేడాతో సిరీస్ కోల్పోయింది.

News December 20, 2025

ASF: బీటీ రోడ్డు కోసం హైదరాబాద్‌కు పాదయాత్ర

image

దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారని లింగాపూర్ మండలం పులసింగ్ గ్రామానికి చెందిన జై చాంద్ ఆవేదన వ్యక్తం చేశారు. లింగాపూర్–పంగిడి మదొర వరకు మంజూరైన బీటీ రోడ్డు పనులు టెండర్లు పూర్తైనా ప్రారంభం కాలేదన్నారు. రోడ్డు లేక అనారోగ్య సమయంలో ఆసుపత్రికి చేరలేక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయన్నారు. రోడ్డు సాధనకై రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.