News December 4, 2025
హుస్నాబాద్: గ్రామాల్లో వెలుగులు నింపేవే సర్పంచ్ ఎన్నికలు: CM

ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ బహిరంగ సభలో పాల్గొన్నారు. సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో మంచివారిని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసేవాళ్లను ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సర్పంచ్ ఎన్నికలు అనేవి గ్రామాలలో అభివృద్ధి, వెలుగులు నింపే ఎన్నికలని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
సంగారెడ్డి: ‘ర్యాగింగ్కు పాల్పడితే జైలుకే’

కళాశాలలో ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే అక్కడే చర్యలు తీసుకుంటారని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య హెచ్చరించారు. సంగారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్పై అవగాహన సమావేశం గురువారం నిర్వహించారు. ర్యాగింగ్కు పాల్పడితే విద్యార్థులకు జైలు శిక్ష విధిస్తారని చెప్పారు. అధ్యాపకులు, ప్రొఫెసర్లు ప్రత్యేక చొరవ తీసుకొని ఇలాంటి ఘటనకు జరగకుండా చూడాలని పేర్కొన్నారు
News December 4, 2025
ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: సీఎం

స్వయం సయహాక మహిళలకు రూ.175 కోట్లతో పెట్రోల్ బంకులు మంజూరు చేయడం, ఇతర సంక్షేమ పథకాలతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తన లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ సభలో గురువారం రూ.19.69 కోట్లతో ఇందిరా మహిళ శక్తి కింద స్వయం సహాయక సంఘాలకు రుణాలకు సంబంధించిన చెక్కు అందజేశారు. 65 లక్షల మంది స్వయం సయహాక మహిళలకు ఇందిరమ్మ చీరలను పంచామన్నారు.
News December 4, 2025
KNR: చేతిలో చంటిబిడ్డతో నామినేషన్

వీర్నపల్లి మండలం అడవిపదిర సర్పంచ్ అభ్యర్థిగా జాలపల్లి సౌందర్య మనోజ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆమె తన 11 రోజుల చిన్నారితో నామినేషన్ దాఖలు చేయడం విశేషం. గ్రామంలో మార్పు తీసుకురావాలంటే గ్రామ అభివృద్ధి కోసం తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.


