News August 26, 2025
హెచ్ఐవి వ్యాధి వ్యాప్తి అరికట్టేందుకు చర్యలు చేపట్టండి: కలెక్టర్

హెచ్ఐవీ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు సంబంధింత శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో 8,680 మందికి హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులను గుర్తించామన్నారు. హెచ్ఐవి వ్యాధి వ్యాప్తి పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News August 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు(ఆగస్టు 27, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.47 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.44 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6.34 గంటలకు ✒ ఇష: రాత్రి 7.48 గంటలకు ✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News August 27, 2025
చవితి వేడుకలకు పటిష్ట బందోబస్తు: SP

వినాయక చవితిని ప్రశాంతంగా, ఆనందంగా చేసుకోవాలని SP కృష్ణ కాంత్ ప్రజలకు సూచించారు. పోలీస్ శాఖ సూచనలు, ఆదేశాలు తప్పని సరిగా పాటించాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నామన్నారు. గణేశ్ నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆయన తెలిపారు.
News August 27, 2025
PM సూర్యఘర్లో జిల్లాకు 8వ స్థానం: JC

సోలార్ యూనిట్ల స్థాపనలో విద్యుత్ అధికారులు వారి లక్ష్యాలను సాధించాలని JC సేతు మాధవన్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జేసీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఏఏ బ్యాంక్ల వద్ద దరఖాస్తులు పెండింగ్ ఉన్నదీ జాబితా తీసుకొని పరిష్కరించాలని ఎస్.ఈకి సూచించారు. PM సూర్యఘర్ పథకంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా 8వ స్థానంలో ఉందని, గత 3 నెలల్లో ప్రగతి ఆశాజనకంగా ఉందని జేసీ అభినందించారు.