News January 3, 2025

హెచ్ఐసీసీలో తెలుగు మహాసభలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు

image

అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు తెలుగువారు ఎక్కడున్నా ఒకటే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. బ్రెయిన్ డ్రెయిన్.. బ్రెయిన్ గెయిన్ అవుతుందని తాను ఆనాడే చెప్పానని ఆ రోజు నేను చెప్పింది ఇవాళ నిజమైందన్నారు. ఈ ప్రాతం గొప్ప ఐటీ సిటీగా మారుతుందన్నారు.

Similar News

News February 5, 2025

గొంగడి త్రిషకు HCA నజరానా

image

మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్‌‌లో సత్తా చాటిన క్రికెటర్ గొంగడి త్రిషకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నజరానా ప్రకటించింది. త్రిషకు రూ.10 లక్షలు, ఆమె హెడ్ కోచ్‌కు రూ.5 లక్షలు, ట్రైనర్ శాలినికి రూ.5 లక్షల నజరానా ప్రకటించింది. మరోవైపు ఆమెకు సీఎం రేవంత్ రూ.కోటి నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

News February 5, 2025

HYD: బాలికతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

image

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కిరణ్ అనే యువకుడికి ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్డు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. పోలీసుల వివరాలిలా.. సరూర్ నగర్ పరిధికి చెందిన కిరణ్ ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన 2020లో జరగ్గా కేసు నమోదైంది. తాజాగా కోర్టు శిక్ష విధించింది. 

News February 5, 2025

త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో రాణించిన క్రికెటర్ గొంగడి త్రిషకు రూ. 1 కోటి, ధృతి కేసరికి రూ. 10 లక్షలు, హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి తలా రూ. 10 లక్షలు నజరానా ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం త్రిషను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!