News February 11, 2025
హెలికాప్టర్ ద్వారా భూ సర్వే నిర్వహించిన వరంగల్ కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739235225621_1047-normal-WIFI.webp)
WGL జిల్లాలో హెలికాప్టర్ ద్వారా డిజిటల్ ఏరియల్ భూ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియను KZPT నుంచి కలెక్టర్ సత్య శారద హెలికాప్టర్లో వర్ధన్నపేటకు బయల్దేరి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ‘నక్ష’ ప్రాజెక్టులో భాగంగా వర్ధన్నపేట మున్సిపాలిటీలోని చెరువులు, కాల్వలు తదితర వివరాలతో అక్షాంశాలు, రేఖాంశాలుగా సంబంధిత ప్రాంతాన్ని నమోదు చేస్తారన్నారు. మంగళవారంలోగా సర్వే పూర్తవుతుందని పేర్కొన్నారు.
Similar News
News February 11, 2025
రావులపాలెం జొన్నాడ బ్రిడ్జి కింద మహిళ మృతదేహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739257195517_52038603-normal-WIFI.webp)
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం బ్రిడ్జి కింద మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు రావులపాలెం ఎస్సై చంటి తెలిపారు. స్థానిక వీఆర్వో ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి, మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మహిళ 5,4 పొడవు, నీలి రంగు చీరతో ఉందన్నారు.
News February 11, 2025
HYD: డ్రగ్స్ పట్టేందుకు 120 జాగిలాలకు శిక్షణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739201987679_15795120-normal-WIFI.webp)
నగరంలో డ్రగ్స్ మూలాలపై ANB యాంటీ నార్కోటిక్ బ్యూరో ఫోకస్ పెట్టింది. బాంబు తరహాలో నార్కిటిక్స్ డాగ్ స్క్వార్డును అధికారులు సిద్ధం చేసినట్లుగా తెలిపారు. సుమారు 120 జాగిలాలను అత్యుత్తమ శిక్షణ ఇచ్చారు. ఈ జాగిలాలు డ్రగ్స్ మూలాలను సైతం పసిగట్టడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.
News February 11, 2025
సభలో మాట్లాడటానికే కదా గెలిపించింది: జీవీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739258345350_782-normal-WIFI.webp)
AP: అసెంబ్లీ అంటే భయంతోనే మాజీ CM జగన్ రావట్లేదని ప్రభుత్వ చీఫ్ విప్ GV ఆంజనేయులు ఆరోపించారు. ‘జగన్ అసెంబ్లీకి రాననడం సమంజసమేనా? ఆయనకు కనీసం ఇంగితజ్ఞానం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది సభ కాదు.. ప్రజలు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చిస్తే సమాధానమిస్తాం. ప్రజా సమస్యలపై ఆసక్తి లేదు కాబట్టే రావట్లేదు. గతంలో ఏ నాయకుడూ ఇలా చేయలేదు. సభలో మాట్లాడటానికే కదా ప్రజలు గెలిపించింది’ అని నిలదీశారు.