News July 3, 2024
హెల్మెట్ లేకుంటే కేసు నమోదు చేయండి: ఎస్పీ మాధవరెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719920696702-normal-WIFI.webp)
ద్విచక్ర వాహన ప్రయాణికులు హెల్మెట్ కచ్చితంగా ధరించాలని, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేయాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో రహదారి ప్రమాదాల నివారణపై అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి వారికి జైలు శిక్ష పడేటట్లు చేయాలన్నారు.
Similar News
News July 5, 2024
అనంతపురం జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720146784016-normal-WIFI.webp)
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో దారుణ హత్య జరిగింది. నల్ల దాసరి పల్లి గ్రామంలో బోయ ఆవుల లక్ష్మన్న (48) అనే వ్యక్తి ఇవాళ తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News July 5, 2024
అనంతపురం, సత్యసాయి జిల్లాలకు వర్ష సూచన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720145703078-normal-WIFI.webp)
ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గుజరాత్-కర్ణాటక తీరాల వెంబడి విస్తరించిన ద్రోణి కారణంగా నేడు అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News July 5, 2024
కదిరిలో వైసీపీ కార్యకర్తలపై కేసు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720136468461-normal-WIFI.webp)
కదిరిలో నడిరోడ్డుపై బాహాబాహీకి దిగిన వైసీపీలోని ఇరువర్గాల కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన వద్ద అప్పుగా తీసుకున్న రూ.5 లక్షలు తిరిగివ్వాలని అడిగినందుకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అంజాద్, ఖాజా తనను అపహరించి చంపేందుకు యత్నించారని సూర్యశేఖర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బలవంతంగా ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా తన మిత్రులు కాపాడారని తెలిపాడు. ఈ ఘటనలో ఇరువర్గాలపై కేసు నమోదైంది.