News August 24, 2025
హెవీ మోటర్ డ్రైవింగ్పై ఉచిత శిక్షణ

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల యువతీ యువకులకు హెవీ మోటార్ డ్రైవింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని కార్యనిర్వాహక సంచాలకుడు కుముద తెలిపారు. 20 ఏళ్ల వయస్సు పైబడిన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 27వ తేదీలోగా అనంతపురంలోని ఎస్సీ కార్పొరేషన్ (పెన్నార్ భవన్)లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేసి, అనంతరం ఆర్టీసీలో డ్రైవింగ్పై శిక్షణ ఇస్తామన్నారు.
Similar News
News August 24, 2025
సీఎం సారూ.. ఇవిగో OU సమస్యలు..!

ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి రేపు పర్యటించనుడంతో వర్సిటీలో నెలకొన్న పలు సమస్యలను సిబ్బంది గుర్తు చేసుకుంటున్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రొఫెసర్లను నియమించాలి. ఉర్దూ శాఖలో ఉన్నది కేవలం నలుగురు అధ్యాపకులు మాత్రమే. అలాగే ఫిలాసఫి, సైకాలజీకి ఇద్దరేసి అధ్యాపకులున్నారు. మొత్తంగా 1000 టీచింగ్, 2400 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
News August 24, 2025
సైకిల్ తొక్కితే ఒత్తిడి తగ్గుతుంది: జిల్లా SP

ప్రతిరోజు సైక్లింగ్ చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతోపాటు, పోలీస్ అధికారులు, సిబ్బంది సైకిల్ తొక్కి వ్యాయామ సాధన చేశారు. అనంతరం ఎస్పీ పలు సూచనలు చేశారు.
News August 24, 2025
మంథని నుంచి శ్రీశైలంకు ప్రత్యేక బస్సు

మంథని బస్టాండ్ నుంచి ఈ నెల 31న శ్రీశైలానికి ప్రత్యేక బస్సు టూర్ ప్యాకేజ్ సర్వీసును ప్రారంభించనున్నట్లు DM శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ బస్సు మంథని బస్టాండ్ నుంచి బయలుదేరి శ్రీశైలం దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో అహోబిలం దర్శనం చేసుకుని మరుసటి రోజు ఉదయం 8 గంటలకు మంథనికి చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.1,800 ఛార్జీ. వివరాల కోసం 9959225923, 9948671514 నంబర్లను సంప్రదించవచ్చు.