News August 14, 2024

హైకోర్టు ఏజీపీగా డిండి మండల వాసి వేణుగోపాల్

image

గుండ్లపల్లి (డిండి) మండలం టీ.గౌరారం గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది పంబాల వేణుగోపాల్‌ను హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దళిత నిరుపేద కుటుంబానికి చెందిన కాశమ్మ, వెంకటయ్య దంపతులకు జన్మించిన పంబాల వేణుగోపాల్ దేవరకొండలో ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించారు.

Similar News

News October 14, 2025

రూ.20తో రూ.2లక్షల బీమా: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

వాహనాల ద్వారా స్వల్పకాలిక పనులు చేసే వారందరూ జీవిత బీమా సౌకర్యాన్ని కలిగి ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందుకుగాను వివిధ బ్యాంకులు రూ.2 లక్షలతో వివిధ రకాల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు. సంవత్సరానికి కేవలం రూ.20 చెల్లిస్తే బీమా వర్తిస్తుందన్నారు. కార్మికులందరికీ ప్రమాద బీమా వర్తింపజేసేందుకు శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News October 13, 2025

ఇసుక తవ్వకాలపై నివేదిక కోరిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

జిల్లాలోని ఇసుక తవ్వకాలకు సంబంధించి కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను నివేదిక కోరారు. నీటిపారుదల, గనులు, భూగర్భ జల వనరులు, టీఎస్ ఎంఐడీసీ, అటవీ, రెవెన్యూ, ముఖ్య ప్రణాళిక అధికారి శాఖల నుంచి ఇసుక తవ్వకాలపై నివేదికలను అందించాలని ఆదేశించారు. ఆయా శాఖలు సమర్పించిన నివేదికలన్నింటిని పూర్తిస్థాయి జిల్లా సమగ్ర నివేదికగా మార్చి అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

News October 13, 2025

ఎస్పీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌ డే.. 35 ఫిర్యాదులు స్వీకరణ

image

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతీ సోమవారం నిర్వహించే పోలీస్‌ గ్రీవెన్స్‌ డే కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో విజయవంతంగా ముగిసింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ దాదాపు 35 మంది అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను చేరువ చేయడమే తమ లక్ష్యమని ఎస్పీ తెలిపారు.