News July 6, 2024
హైకోర్టు ప్రభుత్వ సహాయ ప్లీడర్లుగా ప్రకాశం జిల్లా వాసులు

ఏపీ హైకోర్టులో ప్రభుత్వ సహాయ ప్లీడర్లుగా (AGP) ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ అబ్దుల్ రషీద్ అహమ్మద్, కొల్లూరి అర్జున్ చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం 3వ తేదీ జీవో జారీ చేయగా వారు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వారు.. చిన్న వయసులోనే AGPగా హైకోర్టుకు ఎంపిక కావడంపై జిల్లా వాసులు, తోటి న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News February 25, 2026
సీఎంను ప్రత్యేకంగా ఆకట్టుకున్న ఓ విద్యార్థిని చిత్రలేఖనం

మార్కాపురం బహిరంగ సభలో ఓ విద్యార్థిని గీసిన చిత్రలేఖనం సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మార్కాపురం జిల్లా చెన్నకేశవ స్వామి గోపురం, సీఎం చిత్రాల అందంగా ఉండడంతో విద్యార్థినిని సీఎం అభినందించారు. ఈ చిత్రలేఖనంలో చాలా అర్థం దాగి ఉందని ప్రజలకు వివరించారు. ఆ దేవుడితో పెట్టుకుంటే పతనం ఖాయమని హెచ్చరించారు.
News February 25, 2026
2021లోనే నీళ్లు ఇచ్చేవాడిని: సీఎం

2019 – 24లో సీఎంగా ఉండుంటే 2021లోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇచ్చేవాడినని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి అలాగే ఉదయగిరి, బద్వేల్కు 4,35,000 ఎకరాల సాగుకు నీళ్లు వచ్చేవన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి దొంగ నాటకాలు ఆడి 2019 – 24 మధ్య కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని విమర్శించారు.
News February 25, 2026
ఆ సమయంలో ఫ్లోరైడ్తో బాధపడుతున్నారు: CM

30 ఏళ్ల కిందట మార్కాపురం వచ్చానని, ఆ సమయంలో మీరు కృష్ణా జలాలు ఇవ్వాలని కోరగా.. ఆనాడు హామీ ఇచ్చి, భూమి పూజ చేశాను అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. వెలిగొండ పూర్తిచేసి జాతికి అంకితం చేసే అవకాశం దేవుడు తనకు ఇచ్చాడని సీఎం తెలిపారు. 2014 – 19లో నేరుగా ప్రాజెక్టు దగ్గర వచ్చి పనులను పరిగెత్తించానని, కానీ 2019 – 24 చీకటి రోజులు రావడంతో పనులు ఆటకెక్కాయని చెప్పారు.


