News December 19, 2024

హైకోర్టు మాజీ న్యాయమూర్తికి మెమోరండం సమర్పణ

image

తెలంగాణ రాష్ట్ర షెడ్యూలు కులాల విచారణ కమిషనర్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీం అక్తర్‌ని అంబేడ్కర్ మాల సంఘం నాయకులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ శాస్త్రీయంగా జరగాలని మాల సంఘం అధ్యక్షుడు ఎడబోయిన ప్రభాకర్ కోరారు. ఈ మేరకు హనుమకొండ కలెక్టరేట్‌లో కమిషనర్‌కు వారు మెమోరండం సమర్పించారు. కార్యక్రమంలో మాల సంఘం నాయకులు పాల్గొన్నారు.

Similar News

News October 29, 2025

కల్లెడ చెరువు కట్ట సురక్షితమేనా..?

image

తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షంలో అత్యధికంగా మండలంలోని కల్లెడలో ఉంది. వర్షంతో గ్రామంలో 36.7 సెం.మీ వర్షపాతం నమోదయింది. దీంతో గ్రామంలోని చెరువుకట్ట పరిస్థితి ఏంటని గ్రామస్థులు భయపడుతున్నారు. మూడేళ్ల క్రితం కురిసిన వర్షాలకు గ్రామంలోని చెరువు కట్టకు సమానంగా నీరు చేరడంతో బూర్గుమళ్ల వైపు కట్టని తొలగించి నీటిని తీసివేశారు. ప్రస్తుతం కట్ట పరిస్థితిపై గ్రామస్థులు భయపడుతున్నారు.

News October 29, 2025

WGL: జిల్లాలో 1,554 మి.మీల వర్షపాతం

image

తుఫాన్ కారణంగా వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 1,554 మి.మీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక జిల్లాలో అత్యధికంగా నెక్కొండ మండలంలో 192 మి.మీల, వర్ధన్నపేట-175, ఖిలా వరంగల్-161, పర్వతగిరి-148, సంగేమ్-146, రాయపర్తి-133, WGL-125, ఖానాపురం-119, గీసుగొండ 105 మి.మీ, మిగతా మండలాల్లో 100 లోపు నమోదైంది.

News October 29, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వరంగల్, హన్మకొండ నగరాల్లో రోడ్లు, కాలనీలు జలమయమై జనజీవనం స్తంభించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసర సహాయార్థం జిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.