News March 11, 2025
హైడ్రా ప్రజావాణికి వినతులు వెల్లువ

హైడ్రా సోమవారం ప్రజావాణిని నిర్వహించింది. ప్రజావాణికి మొత్తం 63 ఫిర్యాదులందాయని అధికారులు తెలిపారు. పాత లేఔట్లు, రహదారులు, పార్కులు ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయని వాటిని కాపాడాలని పలువురు వినతులు అందజేశారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జా చేస్తున్నారని వారిపై ఫిర్యాదు చేసినా స్థానిక అధికారుల నుంచి స్పందన లేదని పలువురు వాపోయారు.
Similar News
News March 10, 2025
HYD: ప్రేమించిన అబ్బాయికి మరో పెళ్లి.. యువతి సూసైడ్

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి వెన్నెలగడ్డలో విషాదం జరిగింది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాలు.. MBA చదువుతున్న ప్రియాంక (26) రవికుమార్ అనే వ్యక్తిని ప్రేమించింది. తను వేరే పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికి గురై సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 10, 2025
రంగారెడ్డి జిల్లాలో పరీక్ష రాసింది ఎందరంటే?

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 185 సెంటర్లలో 71,726 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 70,271 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 1,455 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షలు పూర్తైన అనంతరం ఆన్సర్ పేపర్లను స్ట్రాంగ్ రూమ్స్కు తరలించినట్లు పేర్కొన్నారు.
News March 10, 2025
శంషాబాద్: విమానానికి తప్పిన ప్రమాదం

ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సర్వీస్ ఈరోజు ఉదయం 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి శంషాబాద్ మీదుగా వైజాగ్కు వెళ్తోంది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించడంతో పైలట్ సిద్ధమయ్యాడు. అప్పటికే రన్వేపై టేకాఫ్కు సిద్ధంగా ఉన్న మరో విమానాన్ని గమనించి, అప్రమత్తమై గాల్లోకి లేపడంతో పెను ప్రమాదం తప్పింది.