News April 17, 2025

హైదరాబాద్‌లో ఆందోళనలు.. పోలీసుల అప్రమత్తం!

image

నగరంలో కొద్దిరోజులుగా వరుస ఆందోళనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా చర్యలు చేపట్టారు. వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 19న ముస్లిం సంఘాలు ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ ర్యాలీకి పిలుపునిచ్చాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. SMలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టే వారిపై సైతం పోలీసులు నిఘా పెట్టారు.

Similar News

News September 7, 2025

ఎల్బీనగర్: మానవత్వం చాటుకున్న సీపీ

image

రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మానవత్వం చాటుకున్నారు. బాలాపూర్ గణేశ్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లను సీపీ పర్యవేక్షిస్తున్నారు. అయితే మార్గమధ్యలో ప్రమాదానికి గురైన ఓ జంటను గమనించి, తన వాహనాన్ని నిలిపివేశారు. వారికి వెంటనే ప్రథమ చికిత్స చేయించి, సురక్షితంగా పంపించారు. నిమజ్జనంలో బిజీగా ఉన్నప్పటికీ సీపీ తీసుకున్న ఈ ప్రత్యేక చొరవపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

News September 6, 2025

భవన నిర్మాణాల అనుమతులతో GHMCకి భారీ లాభం

image

GHMC భవన నిర్మాణాలకు భారీగా అనుమతులు ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో 4,389 నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, రూ.759.98 కోట్ల ఆదాయం గడించింది. గతేడాది ఇదే సమయంలో వచ్చింది రూ.399.61 కోట్లు కాగా.. ఈసారి రూ.360.37 కోట్లు అదనంగా వచ్చింది. ఈ ఏడాది మొత్తం రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని GHMC అంచనా వేస్తోంది.

News September 6, 2025

బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర రూట్ ఇదే..!

image

HYDలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రధాన రూట్‌ను పోలీసులు ప్రకటించారు. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాసెషన్ కట్ట మైసమ్మ ఆలయం, కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి, అలియాబాద్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మార్గాలుగా సాగి అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, పీవీ ఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వద్దకు చేరుకోనుందని అధికారులు తెలిపారు.