News July 10, 2025

హైదరాబాద్‌లో కల్తీ కల్లు కలకలం

image

హైదరాబాద్ నగరంలో కల్తీ కల్లు ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నిన్నటి వరకు ఐదుగురు మృతిచెందగా.. 31 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కూకట్‌పల్లి PS పరిధిలోని కల్లు కాంపౌండ్లలో మోతాదుకు మించిన కెమికల్స్ కలిపిన కల్లు తాగడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఎక్సైజ్ అధికారులు 5 కేసులు నమోదు చేశారు. కాగా కల్లు దుకాణాలపై నిఘా ఉంచాల్సిన అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో విమర్శలు వస్తున్నాయి.

Similar News

News July 10, 2025

HYD: కల్లీ కల్లు ఘటనలో మృతుల వివరాలు.!

image

కూకట్‌పల్లిలో కల్తీ కల్లు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కూకట్‌పల్లిలో భాగ్యనగర్ కాలనీలోని కల్లు కాంపౌండ్, ఇంద్రహిల్స్‌లోని కల్లు కాంపౌండ్, హైదర్‌నగర్‌లో మరొక్క కల్లు కాంపౌండ్‌లో ఆదివారం తాగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిలో HMT హిల్స్‌కి చెందిన ఇద్దరు, హైదర్‌నగర్, శ్రీరామ్‌నగర్, మహంకాళి నగర్, సాయి చరణ్ కాలనీకి చెందిన వారు మృత్యువాత పడ్డారు. 30 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు.

News July 10, 2025

HYD: అగ్రికల్చర్‌లో AI సాంకేతికత..ఇట్టే పసిగట్టేస్తుంది!

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచానికే నూతన పాఠాలు చెబుతోంది. HYD ఆధారిత ఓ స్టార్ట్‌అప్‌, RR జిల్లా ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సహకారంతో iTrapper అనే ఆధునిక లైట్ ట్రాప్‌ను అభివృద్ధి చేసింది. ఇది రైతులను పింక్ బాల్ వార్మ్ వంటి ప్రమాదకర కీటకాల నుంచి రక్షించడంలో సహాయ పడుతుందన్నారు. గులాబీ తెగులును ఇట్టే పసిగట్టేస్తుంది.

News July 10, 2025

ఘట్‌కేసర్: కన్న తండ్రినే హతమార్చింది

image

ప్రియుడు, తల్లితో కలిసి కన్న తండ్రినే హతమార్చిన ఘటన ఘట్‌కేసర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. ముషీరాబాద్- ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతుల పెద్ద కుమార్తె భర్తతో విడిపోయి వీరి వద్దే ఉంటుంది. మనీషా వివాహేతర సంబంధంపై తండ్రి హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా.. ఈనెల 5న ప్రియుడు మహ్మద్ జావీద్‌, తల్లితో కలిసి తండ్రిని చంపేసి శవాన్ని ఏదులాబాద్ చెరువులో పడేశారు.