News August 6, 2024
హైదరాబాద్లో భారీగా తగ్గిన చికెన్ ధరలు

శ్రావణ మాసం మొదలుకావడంతో నగరంలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత ఆదివారం వరకు రాజధానిలో బోనాల సంబరాలు నిర్వహించారు. దీంతో మాంసంకు డిమాండ్ పెరిగింది. కేజీ చికెన్ రూ. 200 పైననే విక్రయించారు. ఇక నిన్నటి నుంచి మాంసం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం డ్రెస్డ్ కేజీ ధర రూ. 148, స్కిన్లెస్ ధర రూ. 168, ఫాంరేటు రూ. 80, రిటైల్ రూ. 102గా ఉంది.
SHARE IT
Similar News
News November 9, 2025
రాయదుర్గం PSలో మాగంటి గోపీనాథ్ తల్లి ఫిర్యాదు

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని గోపీనాథ్ మృతి ఆయన తల్లి రాయదుర్గం PSలో ఫిర్యాదు చేశారు. మాగంటి మహనంద కుమారి కుమారుడు మరణంపై పోలీసులు దర్యాప్తు చెయ్యాలని సూచించారు. మృతికి సంబంధించి మొదటి నుంచి తల్లి మహానందకుమారి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి తెలిసిందే.
News November 8, 2025
గ్యారెంటీలకు జూబ్లీహిల్స్లో BRS గెలవాలి: హరీశ్రావు

సునీతమ్మను అవహేళన చేసిన కాంగ్రెస్ నాయకులకు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. మాగంటి గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేద ప్రజలకు, బస్తీ వాసులకు అండగా నిలిచారని అన్నారు. షేక్పేట్లోని అంబేడ్కర్ నగర్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు.
News November 8, 2025
HYD: ‘బస్తర్ హననంపై మీడియా మౌనం ఎందుకు’

దేశంలో దారుణమైన ఘటనలు జరిగినప్పుడు పలు కథనాలను ప్రచురించే మీడియా బస్తర్లో జరుగుతున్న హననంపై మౌనం ఎందుకు వహిస్తుందో గమనించాలని మాజీ సంపాదకులు కే.శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. SVKలో పౌర హక్కుల సంఘం తెలంగాణ 3వ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని మీడియా సంస్థలను కంట్రోల్ చేసే వ్యవస్థ ఢిల్లీలో ఉందని, అందుకే మీడియా సంస్థలు మౌనం వహిస్తున్నాయని అన్నారు. రఘునాథ్, ప్రొ.హరగోపాల్, లక్ష్మణ్ పాల్గొన్నారు.


