News March 1, 2025
హైదరాబాద్లో రేపటి నుంచి నైట్ఔట్!

నైట్ ఔట్ కల్చర్ మన హైదరాబాదీలకు కొత్తేమీ కాదు. కానీ, రేపటి నుంచి నగరంలో కొత్త రూల్స్ ఉండబోతున్నాయి. రంజాన్ నెల సందర్భంగా వ్యాపారులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. 24 గంటలూ దుకాణాలు ఓపెన్ చేసేందుకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. రేపటి నుంచి మార్చి 31 వరకు ఈ రూల్స్ అమల్లో ఉంటాయి. ఇక మిడ్నైట్ షాపింగ్కు మన చార్మినార్లోని వ్యాపారులు సిద్ధమవుతున్నారు.
Similar News
News April 23, 2025
HYDలో నేడు ఎన్నికలు.. BJP VS MIM

GHMC హెడ్ ఆఫీస్లో నేడు స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. MIM నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్, BJP నుంచి గౌతంరావు బరిలో ఉన్నారు. 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియోలతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. MIMకు 50 ఓట్లు, BRSకు 24, BJPకి 24, INCకు 14 ఓట్లు ఉన్నాయి. 22 ఏళ్ల తర్వాత ఈ ఎన్నిక జరగడం, INC, BRS పోటీ చేయకపోవడంతో గ్రేటర్ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. APR 25న లెక్కింపు జరగనుంది.
News April 23, 2025
HYD: BRS సభకు లగచర్ల బాధితుల విరాళం

లగచర్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం నంది నగర్లోని తన నివాసం వద్ద కేటీఆర్ని లగచర్ల బాధితులు కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. దీనికి సంబంధించి చెక్కును కేటీఆర్కు ఇచ్చారు. విరాళం అందించిన వారందరినీ కేటీఆర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బహిరంగ సభను చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
News April 23, 2025
HYD: తెలంగాణ పోలీస్ క్రీడాకారులకు 18 పతకాలు

కొచ్చిలో జరిగిన తొలి అఖిల భారత పోలీస్ బ్యాడ్మింటన్ క్లస్టర్ టోర్నీలో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు ప్రతిభ చూపారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పోటీపడి12 మంది అధికారులు మొత్తం 18 పతకాలు గెలుచుకున్నారు. వాటిలో 2 బంగారు, 2 వెండి, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. వీరిని డీజీపీ జితేందర్ అభినందించారు. ఈ విజయం పోలీస్ శాఖకు గర్వకారణం అన్నారు.