News March 20, 2025

హైదరాబాద్‌లో OYO 2.O!

image

HYDలో OYOకు డిమాండ్‌ పెరిగింది. ఇటీవల సర్వేలోనూ నిజమని తేలింది. పాతబస్తీ గల్లీల నుంచి ORR వరకు ఓయోలే దర్శనమిస్తున్నాయి. చిన్న.. చిన్న లాడ్జీలను సైతం ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. రూ.500కే గదులను అద్దెకు ఇవ్వడంతో జనం క్యూ కడుతున్నారు. హోటళ్లు, గదులను లగ్జరీగా డిజైన్ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ చిల్ అవ్వాలని యువతను ఆకర్శిస్తున్నారు. దీంతో HYDలో OYO కొత్తపుంతలు తొక్కుతోంది

Similar News

News March 20, 2025

నాగర్‌కర్నూల్: ముగిసిన ఇంటర్ పరీక్షలు..

image

ఇంటర్మీడియట్‌ పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 33 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 5 నుంచి పరీక్షలు జరిగాయి. ద్వితీయ సంవత్సరం 5,996 మంది విద్యార్థులకు గానూ 207 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నాగర్ కర్నూల్ జిల్లా ఇంటర్ నోడల్ అధికారి జి.వెంకటరమణ తెలిపారు. గురువారం పరీక్షలు పూర్తికావడంతో విద్యార్థులు కేంద్రాల నుంచి ఉత్సాహంతో బయటకు వచ్చారు. దీంతో బస్టాండ్‌లు విద్యార్థులతో కిక్కిరిశాయి.

News March 20, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

image

ఆసిఫాబాద్ జిల్లాలో మూడ్రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం కలగనుంది. పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్న ఆందోళన చెందుతున్నారు. రైతులు పంటలను సంరక్షించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 20, 2025

ములుగు: బెట్టింగ్ యాప్‌లపై నిఘా: SP

image

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్‌లకు అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ములుగు ఎస్పీ శబరిశ్ సూచించారు. యాపుల్లో బెట్టింగుకు పాల్పడినా, గేమింగ్ ఆడినా, ప్రోత్సహించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్‌కు అలవాటు పడి, డబ్బులు కోల్పోయి అప్పుల పాలవుతున్నారన్నారు. ఇలాంటి యాప్‌ల వల్ల ఆత్మహత్యలకు దారితీస్తుందన్నారు. జిల్లా ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలన్నారు.

error: Content is protected !!