News May 14, 2024
హైదరాబాద్: అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!

రాజధాని ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ లోక్సభలో 30 మంది, సికింద్రాబాద్లో 45, మల్కాజిగిరిలో 43, చేవెళ్లలో 22, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలో 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత HYD రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో టెన్షన్ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.
Similar News
News September 14, 2025
HYD: అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై మీ కామెంట్..?

ఇప్పుడు ఏ నోట విన్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముచ్చట్లే వినిపిస్తున్నాయి. తాజాగా గాంధీభవన్లో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని తనకు అవకాశం ఇవ్వాలంటూ చిట్ చాట్ చేసినట్లు సమాచారం. తమ సామాజిక వర్గం నుంచి ఎవరూ కూడా మంత్రిగా లేరని, తనకంటే సీనియర్ ఎవరైనా జూబ్లీహిల్స్ నుంచి ఉంటే తాను టికెట్ అడగనంటూ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై మీ కామెంట్?
News September 14, 2025
జూబ్లీహిల్స్: వర్షంలోనూ మాగంటి కుమార్తెల పర్యటన..!

జూబ్లీహిల్స్లో BRSని ప్రజలు గెలిపించాలని మాజీ MLA మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశిర కోరారు. ఈ మేరకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈరోజు నియోజకవర్గ పరిధి రహమత్నగర్ డివిజన్ ఓం నగర్ కాలనీలో పర్యటించారు. BRSమహిళా నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతోనే తమ తండ్రి గోపీనాథ్ 3సార్లు గెలిచారన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు.
News September 13, 2025
కూకట్పల్లి: రేణు అగర్వాల్ను చంపింది వీళ్లే..!

HYD కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో రేణు అగర్వాల్(50)ను ఇటీవల <<17699611>>దారుణంగా హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. యువకులు డబ్బు, నగల కోసం యజమానురాలిని తాళ్లతో కట్టేసి, గొంతులో కత్తితో పొడిచి, ప్రెషర్ కుక్కర్తో తలపై కొట్టి చంపేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించగా ఇప్పుడు జైలులో కటకటాలను లెక్కిస్తున్నారు.