News August 27, 2025
హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం.. రిపోర్టు ఇదే!

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. నేడు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి అత్యధికంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 14.8 మిల్లీమీటర్లు, కూకట్నల్లి 10, కుత్బుల్లాపూర్ 8, అల్వాల్ 7.8, షేక్పేట 6, మారేడుపల్లిలో 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. గణపతి పండుగ వేళ వర్షం కురుస్తుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News September 11, 2025
HYD: మ్యాన్హోల్ తెరిచి ఉంటే కాల్ చేయండి!

వర్షాకాలం వరద పోయేందుకు వీలుగా మ్యాన్హోళ్ల మూతలు తెరవడం, వరద తగ్గగానే వాటి తిరిగి మూసేస్తున్నట్లు హైడ్రా తెలిపింది. మూత తెరిచి ఉన్న దగ్గర సిబ్బంది ఉండేలా చూస్తామని, ఒక వేళ ఎక్కడైనా పొరపాటున మ్యాన్హోల్ మూత తెరచి ఉంటే 9000113667 నంబరుకు కాల్ చేసి తెలియజేయాలని హైడ్రా కోరింది.
News September 11, 2025
29వ తేదీలోగా అన్ని పీజీ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు

ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల ఇంటర్నల్ పరీక్షలను ఈ నెల 29వ తేదీలోగా నిర్వహించాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని కళాశాలలకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని పీజీ కోర్సుల 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలను త్వరితగతిన నిర్వహించాలని సూచించారు. ఈ నెల 29వ తేదీలోగా మార్కుల జాబితాను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు.
News September 11, 2025
HYD: అటవీశాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయం: మంత్రి

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయమని మంత్రి కొండా సురేఖ అన్నారు. నెహ్రూ జులాజికల్ పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ డా.జితేందర్, పీసీసీఎఫ్ సువర్ణ, కలెక్టర్ హరిచందనలతో కలసి అమరులకు పూలతో శ్రద్ధాంజలి ఘటించారు.