News October 27, 2025
హైదరాబాద్ సిటీ పోలీసుల మెగా రక్తదాన శిబిరం

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీసులు సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 12 జోన్లలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 3,500 మంది దాతలు రక్తం ఇచ్చారు. థలసేమియా రోగుల కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. అమరవీరుల త్యాగానికి ఇది నివాళి. తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. “రక్తదానం ప్రాణదానంతో సమానం” అని తెలిపారు. పోలీసులు, పౌరులు ఇందులో పాల్గొన్నారు.
Similar News
News October 28, 2025
HYD: ఇంటింటికీ వెళ్లి మాగంటి సునీత ప్రచారం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో వెంగళరావునగర్ డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ నేతలు ఈరోజు ప్రచారం చేపట్టారు. సిద్ధార్థనగర్ ఏజీ కాలనీలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. BRSకు ఓటు వేసి, తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
News October 28, 2025
HYD: జూబ్లీహిల్స్లో స్పీడ్ పెంచిన కాంగ్రెస్..!

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా నేడు ఉపఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించింది. TPCC ఇన్ఛార్జ్ మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొని, నేతలకు దిశా నిర్దేశం చేశారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, గ్రేటర్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు. ఇక ఎన్నికల వరకు అందరూ జూబ్లీహిల్స్లోనే ఉంటూ ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు.
News October 28, 2025
HYD: చున్నీతో గొంతు బిగించి భర్తను చంపింది..!

HYD బాలాపూర్ మండలం మీర్పేట్ PS పరిధిలో విజయ్ కుమార్ అనుమానాస్పద మరణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్ట్మార్టం నివేదికలో హత్యగా నిర్ధారణ కావడంతో భార్య సంధ్య నిందితురాలని తేలింది. మద్యం తాగి, వేధించే భర్తతో నిత్యం గొడవ జరుగుతుండడంతో అక్టోబర్ 19న చున్నీతో గొంతు బిగించి చంపినట్లు సంధ్య ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.


