News August 9, 2024
హైదరాబాద్: సెలవు ఇవ్వాలని డిమాండ్

ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్కు రెండవ శనివారం తప్పక సెలవు ఇవ్వాలని TPTLF(తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్) డిమాండ్ చేస్తోంది. నాంపల్లిలో విద్యాశాఖ అడిషనల్ డెరైక్టర్ లింగయ్యకి మెమోరాండం అందజేశారు. రోజుకు 8 నుంచి 10 గంటలు పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో DYFI రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, SFI రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేశ్ జునుగారి, నాయకులు సాయి కిరణ్ ఉన్నారు.
Similar News
News December 30, 2025
NEW YEAR: అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో

న్యూ ఇయర్ వేళ నగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు చివరి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. రేపు 31ST నైట్ ఈవెంట్ల నేపథ్యంలో అర్ధరాత్రి కూడా మెట్రో రైల్ సేవలు అందించనుంది. జనవరి 1న అర్ధరాత్రి ఒంటి గంటకు చివరి రైలు ఉంటుంది. ఈ న్యూ ఇయర్కి జర్నీ స్ట్రెస్ లేకుండా సెలబ్రేషన్ చేసుకోవాలని మెట్రో అధికారులు సూచించారు.
SHARE IT
News December 30, 2025
HYD: టోల్ప్లాజాలు ఉండవిక.. RRRకు శాటిలైట్

హైవే మీద టోల్ కట్టడానికి కారు ఆపే రోజులకు ఇక చరమగీతం పాడబోతున్నారు. RRR వెంబడి ఎక్కడా మీకు టోల్ గేట్లు కనిపించవు. ఇది FREE అనుకుంటే పొరపాటే. కేంద్రం ఇక్కడ Global Navigation Satellite System శాటిలైట్ ట్రాకింగ్ అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తోంది. రోడ్డు ఎక్కిన సెకను నుంచే ఆకాశంలో ఉన్న శాటిలైట్ మీ కారుని ఫాలో అవుతుంది. ప్రయాణించిన ప్రతి మీటరుకు లెక్క కట్టి, నేరుగా అకౌంట్ నుంచి పైసలు లాగేస్తుంది.
News December 30, 2025
HYD: ASBL ఫ్యామిలీ డే 2025

ASBL ఫ్యామిలీ డే 2025.. ASBL ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన వ్యక్తులందరినీ ఒకచోటకు చేర్చింది. ఇది నమ్మకం, ఉమ్మడి విలువలు, సామూహిక అభివృద్ధికై జరుపుకున్న వేడుక. వ్యవస్థాపకులు, CEO అజితేష్ కొరుపోలు గతం, భవిష్యత్తు గురించి మనస్ఫూర్తిగా, ఆత్మీయంగా వారి భావాలను పంచుకున్నారు. ఈ వేడుక ఒక నమ్మకాన్ని బలపరిచిందన్నారు. ASBL కేవలం ప్రాజెక్టులపై మాత్రమే కాదు, నమ్మకంపై నిర్మించబడిందని అజితేష్ కొరుపోలు అన్నారు.


