News April 28, 2024

హైదరాబాద్: MMTSలో SIని బెదిరించి‌ చోరీ

image

MMTS రైలులో వెళుతున్న CRPF SI‌ను బెదిరించిన ఆగంతకులు గొలుసు లాక్కెళ్లిన సంఘటన కాచిగూడ రైల్వే PS పరిధిలో జరిగింది. రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి వాసి ప్రసాద్(CRPF SI) శుక్రవారం రాత్రి MMTSలో ప్రయాణించారు. యాకుత్‌పుర‌-ఉప్పుగూడ స్టేషన్ల మధ్యన ముగ్గురు ఆగంతకులు కత్తితో బెదిరించి ఆయన మెడలోని 15 గ్రాముల బంగారు గొలుసు, రెండు సెల్ ఫోన్లు దొంగిలించారు. కేసు నమోదైంది.

Similar News

News September 12, 2025

సికింద్రాబాద్: గాంధీలో సేవలు ఇకనైనా గాడిన పడేనా?

image

గాంధీ ఆస్పత్రి అంటేనే తెలుగు రాష్ట్రాల్లోని పేదలకు ఓ ధైర్యం.. అలాంటిది ఇటీవల ఇందులో సరైన సేవలందడం లేదని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనంతటికీ కారణం సూపరింటెండెంట్ డా.రాజకుమారి నిర్లక్ష్య వైఖరే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ప్రభుత్వం ఆమె స్థానంలో అడిషనల్ DME డా.వాణి నూతన సూపరింటెండెంట్‌ను నియమించింది. ఇప్పుడైనా సేవలు మెరుగుపడతాయేమోనని నగర వాసులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

News September 12, 2025

KPHB: ఆత్మహత్యాయత్నం కేసులో గృహిణి రిమాండ్

image

KPHB 6వ ఫేజ్‌లో దంపతులు సూసైడ్ అటెంప్ట్ కేసు గత నెల 30న సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిలో భర్త రామకృష్ణారెడ్డి చనిపోగా భార్య రమ్యకృష్ణ చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అప్పుల బాధ తాళలేక ఇద్దరు ఆత్మహత్యకు యత్నించడం, భర్తను కత్తితో గాయపరచగా రక్తస్రాపమై మృతి చెందాడు. భార్య చనిపోవడానికి ప్రయత్నించగా భయం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

News September 12, 2025

HYD: ఈ మెట్రో రైలు మాకొద్దు బాబోయ్: L&T

image

HYDలో లక్షలాది మంది ప్రయాణికులను చేరవేస్తున్న మెట్రో రైల్ నిర్వహణ తమకు చేతకావడం లేదని.. ఖర్చులు పెరిగిపోతున్నాయని L&T కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దాదాపు రూ.5వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉందని.. రోజూ వచ్చే టికెట్ ఆదాయం సరిపోవడం లేదని.. ఇలా అయితే ఉద్యోగుల జీతాలు ఇచ్చుకోలేమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.