News November 19, 2025
హోటల్ రూమ్లకు భలే డిమాండ్

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు భారీగా తరలివస్తుండటంతో పుట్టపర్తిలో లాడ్జిలకు డిమాండ్ పెరిగింది. రూ.5 వేలు పెట్టినా రూములు దొరకడం లేదు. అయితే, ట్రస్ట్ తరఫున 50 వేల మందికి సరిపడేలా వసతి షెడ్లు ఏర్పాటు చేసి, మూడు పూటలా భోజన సౌకర్యం కల్పించారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయానికి ఉతచి బస్సులు ఏర్పాటు చేశారు. దేవభూమి ఆధ్యాత్మక శోభతో వెలుగొందుతోంది.
Similar News
News April 13, 2026
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

TG: మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోళ్లలో అవినీతి అంటూ BRS చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఆ పార్టీ SMలో చేస్తున్న దుష్ప్రచారానికి KCRదే బాధ్యతని సీతక్క పేర్కొన్నారు. తన ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. 48 గంటల్లో ఆ పోస్టులను తొలగించి KCR క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
News April 13, 2026
TGTET-2026 నోటిఫికేషన్ విడుదల

TGTET-2026కు ఈ నెల 15-30 మధ్య <
News April 13, 2026
‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల

TG: 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్ వెలువడింది. ఈనెల 15 నుంచి 3 విడతల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. APR 15-మే 7 వరకు తొలి విడత, మే 15-25 వరకు రెండో విడత, మే 31-జూన్ 15 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్ నిర్వహిస్తారు.


