News October 26, 2025
హోప్ ఐలాండ్కు అధికారులు.. రామంటున్న మత్స్యకారులు

తాళ్లరేవు మండలం కోరంగి సమీపంలోని హోప్ ఐలాండ్లో ఉన్న 110 మంది మత్స్యకారులను తుపాను నేపథ్యంలో తరలించేందుకు కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, జిల్లా పోలీసు అధికారులు అక్కడికి వెళ్లారు. అయితే తుపానులు తమకు అలవాటేనంటూ వారు సురక్షిత ప్రాంతాలకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినడం లేదని ఆర్డీఓ వెల్లడించారు.
Similar News
News October 26, 2025
ASF: ఢిల్లీకి చేరిన జాబితా.. ఎవరి ధీమా వారిదే!

తెలంగాణ రాష్ట్ర డీసీసీల జాబితా ఢిల్లీకి చేరింది. CM రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో డీసీసీల జాబితాను ఢిల్లీ పెద్దలకు అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ పదవిపై ఎవరి ధీమా వారికే ఉంది. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ఎవరికి వారే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News October 26, 2025
కాకినాడ: విద్యాసంస్థలకు ఐదు రోజుల సెలవులు

తుపాను నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు 26వ తేదీ సాయంత్రం నాటికి ఇళ్లకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ ఐదు రోజులు ఏ ఒక్క విద్యాసంస్థ తెరిచి ఉండకూడదని, కళాశాలలకు కూడా ఈ సెలవు వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 26, 2025
అష్ట ధర్మములు ఏవంటే?

1. యజ్ఞాలు చేయడం, 2. వేదాలు చదవడం,
3. దానాలు చేయడం, 4. తపస్సు చేయడం,
5. సత్యాన్నే పలకడం, 6. సహనం పాటించడం,
7. కష్ట సమయాల్లో నిలకడ, ధైర్యంగా ఉండటం,
8. వివేకం, ముందుచూపుతో వ్యవహరించడం.
ఈ ఎనిమిది ధర్మాలను పాటించడం వలన మనిషి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ, ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
<<-se>>#Sankhya<<>>


