News November 1, 2025

హ్యాకథాన్‌లో మెరిసిన రాజంపేట విద్యార్థులు

image

తిరుపతిలో నిర్వహించిన SYNAPSE 2K25– 24 గంటల హ్యాకథాన్‌లో రాజంపేట అన్నమాచార్య యూనివర్శిటీ విద్యార్థులు అద్భుత ప్రతిభను ప్రదర్శించి టాప్ 10 జట్లలో స్థానం సాధించారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల నుంచి అనేక బృందాలు పాల్గొన్నాయి. జాతీయ స్థాయి సాంకేతిక పోటీలో ఎల్‌ఎంఎస్ ప్లాట్‌ఫారమ్ విత్ కంపెనీ కన్‌స్ట్రెయింట్స్ అంశంపై వినూత్న పరిష్కారాన్ని రాజంపేట విద్యార్థులు రూపొందించారు.

Similar News

News November 1, 2025

వేలేరుపాడు: రూ.1,000 కోట్లు చెక్కు పంపిణీ చేసిన మంత్రి

image

వేలేరుపాడు మండలంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించిన రూ. 1,000 కోట్ల భూసేకరణ పునరావాసం సంబంధించిన చెక్కిన సంబంధిత నిర్వాసితులకు మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. నిర్వాసితులకు నేరుగా రూ.1,000 కోట్ల పరిహారం బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని, నిర్వాసితులకు అన్నివిధాల న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిది అని మంత్రి తెలిపారు.

News November 1, 2025

ఇతరుల అదృష్టం చూసి, వారిలా ఇల్లు కట్టొచ్చా?

image

ఇతరుల అదృష్టం చూసి వారి ఇంటిలాగే మనం కూడా ఇల్లు కట్టుకుంటే అదే ఫలితం ఉండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ఇంటి నిర్మాణానికి, ఇంటి స్థలం, దిశ, ముఖద్వారాలకు ఇంటి యజమాని పేరు, జన్మరాశి అనుకూలంగా ఉండాలన్నారు. ‘ఇంట్లో వస్తువులు, ఫర్నిచర్, మంచాలు వంటి అమరికలు కూడా వాస్తు నియమాలకు అనుగుణంగా ఉండాలి. అప్పుడే మనకు అనుకూలమైన మంచి ఫలితాలు పొందే అవకాశం ఏర్పడుతుంది’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>

News November 1, 2025

ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నం: జగన్

image

AP: కాశీబుగ్గ తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. ‘రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడంపై చంద్రబాబుకు ఉన్న శ్రద్ధ ఆలయాలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలో లేదు. ఏకాదశి వేళ భక్తులు వస్తున్నారని తెలిసినా చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇప్పుడు ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.