News February 19, 2026
₹10 లక్షల కోట్లతో అంబానీ AI ప్లాన్స్

ఢిల్లీ వేదికగా జరుగుతున్న AI సదస్సులో ముకేశ్ అంబానీ, TATA ఛైర్మన్ చంద్రశేఖరన్ కీలక ప్రకటనలు చేశారు. రిలయన్స్ రాబోయే ఏడేళ్లలో ఏకంగా ₹10లక్షల కోట్లు AI మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టనున్నట్లు అంబానీ తెలిపారు. ఇంటెలిజెన్స్తో భారత్ను అనుసంధానిస్తామని పేర్కొన్నారు. మరోవైపు INDలో తొలి AI ఆప్టిమైజ్డ్ డేటా సెంటర్ను నిర్మిస్తున్నట్లు.. దీనికోసం OpenAIతో డీల్ చేసుకున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది.
Similar News
News February 19, 2026
హైదరాబాద్ బిర్యానీ రెస్టారెంట్లు.. ₹70,000 కోట్లకు లెక్క లేదు!

హైదరాబాద్ బిర్యానీ చైన్ రెస్టారెంట్స్ ₹70,000 కోట్ల మేర సేల్స్ లెక్కల్లో చూపలేదని ఆదాయపన్ను శాఖ గుర్తించింది. బిల్స్ డిలీట్, ఎడిటింగ్ వంటివి చేస్తూ తక్కువ సేల్ చూపించి పన్ను ఎగ్గొడుతున్నట్లు గుర్తించింది. బిల్లింగ్కు వాడే సాఫ్ట్వేర్ డేటాను Ai సహా లేటెస్ట్ టూల్స్తో విశ్లేషించగా ఇది తెలిసింది. 2019-20 సం. నుంచి విశ్లేషించిన 10% డేటాతో TN, KA, TG, MH, GJ రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉందని తేలింది.
News February 19, 2026
రేపు ఢిల్లీ ఏఐ సమ్మిట్కు CM చంద్రబాబు

AP: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జరుగుతున్న ఏఐ సమ్మిట్లో పాల్గొంటారు. అక్కడికి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. IBM, UNICC, NIELIT సంస్థలతో ఈ ఒప్పందాలు జరగనున్నాయి. UK మంత్రి, ఆరామ్కో ఇండియా, అడోబ్ ఇండియా సీఈఓలతో చంద్రబాబు సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగి అమరావతికి చేరుకుంటారు.
News February 19, 2026
ఎప్స్టీన్ ఫైల్స్: బ్రిటన్ మాజీ ప్రిన్స్ అరెస్ట్

బ్రిటన్ మాజీ యువరాజు (ప్రిన్స్) ఆండ్రూను పోలీసులు అరెస్టు చేశారు. ఈస్టర్న్ ఇంగ్లండ్లోని ఆయన నివాసానికి 6 కార్లలో వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ‘ప్రభుత్వ కార్యాలయంలో తప్పుడు ప్రవర్తన’ కింద అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడం గమనార్హం. కాగా అమెరికా లైంగిక నేరస్థుడు ఎప్స్టీన్కు ఆండ్రూ కీలకమైన వాణిజ్య నివేదికలు పంపినట్లు ఆరోపణలున్నాయి.


