News October 6, 2024

రిలయన్స్ వల్ల ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు ₹24 కోట్ల న‌ష్ట‌ం

image

రిల‌య‌న్స్‌ సంస్థతో స్పాన్సర్‌షిప్ ఒప్పంద త‌ప్పిదాల వ‌ల్ల భారత ఒలింపిక్ సంఘానికి ₹24 కోట్ల న‌ష్ట‌ం వాటిల్లిన‌ట్టు కాగ్ లెక్క‌గ‌ట్టింది. 2022-2028 వరకు ఆసియా క్రీడ‌లు, కామ‌న్వెల్త్ గేమ్స్‌, Olympicకు Principal Partnerగా రిల‌య‌న్స్‌తో ఒప్పందం జరిగింది. త‌దుప‌రి 2026-30 వింట‌ర్ ఒలింపిక్స్‌, యూత్ ఒలింపిక్ హ‌క్కుల‌నూ రిల‌య‌న్స్‌కు కేటాయించారు. కానీ ఆ మేరకు నిధుల ఒప్పందం జ‌ర‌గ‌లేద‌ని కాగ్ పేర్కొంది.

Similar News

News March 12, 2026

త్వరలో మరో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి?

image

టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ వెడ్డింగ్ జరగనున్నట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు కాలభైరవతో ‘బలగం’ ఫేమ్ కావ్య కళ్యాణ్‌రామ్ ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని టాక్. ఈ విషయంపై ఇరు కుటుంబాలు ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా ఇటీవల విజయ్-రష్మిక, అల్లు శిరీష్-నయనిక వివాహాలు జరగగా, త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్-కావ్యా రెడ్డి ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే.

News March 12, 2026

16న ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

image

AP: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర స్థాయి, అన్ని జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ విందుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 16న విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. జిల్లాల స్థాయిలో వచ్చే 5 రోజుల్లో కలెక్టర్లు తమకు అనువైన రోజున ఇఫ్తార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.

News March 12, 2026

వరి పంట విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

వరి పంట ప్రస్తుతం నాటిన సమయాన్ని బట్టి ఈనిక, గింజ పాలుపోసుకునే దశ, పూత దశలో ఉంది. ఈ సమయంలో పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ఒకవేళ పంట పూత దశలో ఉన్నట్లైతే నీటి ఎద్దడికి గురికాకుండా 2 అంగుళాల మేర నీరు ఉండేలా చూడాలి. పంట పిలక దశలో ఉంటే రెండో దఫాగా 45 kgల యూరియా వేయాలి. చిరుపొట్ట దశలో ఉన్న పొలాల్లో చివరి దఫా యూరియా 45KGలు+ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 20kgలు వేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.