News December 16, 2024
₹37,000 CR: పన్ను ఎగ్గొట్టినోళ్ల నుంచి వసూలు
పన్ను ఎగవేతదారులపై IT శాఖ కొరడా ఝుళిపించింది. అధిక ఆదాయం పొందుతూ ITR దాఖలు చేయనివారి నుంచి 20 నెలల్లోనే రూ.37,000 కోట్లు వసూలు చేసింది. ఎగవేతదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేసేందుకు ప్రభుత్వం డేటా అనలిటిక్స్, నాన్ ఫైలర్ మానిటరింగ్ సిస్టమ్ (NMS), TDSలను ప్రాసెస్ చేసింది. లగ్జరీ స్పెండింగ్, బంగారం, నగలు, వజ్రాలను మొత్తం నగదు రూపంలో కొనుగోలు చేసి ITRఫైల్ చేయని వారిని గుర్తించి తనిఖీలు చేపట్టింది.
Similar News
News February 5, 2025
రేపు సీఎల్పీ సమావేశం
TG: రేపు కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశం కానుంది. మ.3 గంటలకు హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలపై ఎమ్మెల్యేలకు రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు.
News February 5, 2025
ఢిల్లీలో కాంగ్రెస్కు శూన్య హస్తమేనా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మెజారిటీ సంస్థలు BJPకి, మరికొన్ని ఆప్కు అధికారం దక్కుతుందని తెలిపాయి. కాగా, దాదాపు అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్ ఖాతా తెరవదని చెప్పాయి. 0-3 సీట్లకే ఛాన్స్ ఉందని ఒకట్రెండు తెలిపాయి. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పని ఖతమైనట్లే అని, ఆప్తో పొత్తు పెట్టుకోవాల్సిందని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు.
News February 5, 2025
రేపు జగన్ ప్రెస్మీట్
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు కీలక ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ప్రజా సమస్యలపై ఆయన ప్రసంగిస్తారు. కాగా ఇవాళ విజయవాడ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో జగన్ కూటమి సర్కార్పై ఫైర్ అయ్యారు. ఈసారి జగనన్న 2.0 వేరే లెవెల్లో ఉంటుందని కూటమి సర్కార్ను ఆయన హెచ్చరించారు.