News June 29, 2024
జియో, ఎయిర్టెల్ యూజర్లపై ₹47వేలకోట్ల భారం!

టారిఫ్ పెంపుతో జియో, ఎయిర్టెల్ యూజర్లపై ఏటా ₹47,500కోట్ల భారం పడనుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 5జీ సేవలు కావాలనుకునే వారిపై ఈ భారం మరింత ఎక్కువ ఉండనుందని తెలిపారు. జియోలో ₹239 (1.5GB/డే)గా ఉన్న 5జీ మినిమమ్ రీఛార్జ్ అమౌంట్ను 46% పెంచి ₹349 (2GB/డే)కు చేర్చింది. ఎయిర్టెల్ ఏకంగా 71% పెంచింది. ₹239 (1.5GB/డే) ప్యాక్ను ₹409 (2.5GB/డే)కు పెంచింది.
Similar News
News January 1, 2026
మెట్ల కింద స్నానాల గది ఉండవచ్చా?

మెట్ల కింద స్నానాల గది నిర్మించడం శ్రేయస్కరం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. మెట్లు ఎక్కేటప్పుడు పాదాల కింద పవిత్రత లేని ప్రదేశం ఉంటే ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని అంటున్నారు. ‘మెట్ల కింద స్థలం చాలా ఇరుకుగా ఉండి, పైకప్పు తలకి తగిలే ప్రమాదం ఉంటుంది. గాలి, వెలుతురు సరిగ్గా ప్రసరించవు. అనారోగ్య సమస్యలు రావొచ్చు. మురుగునీటి పైపుల నిర్వహణ కష్టమవుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 1, 2026
ఎల్లుండి సూపర్ మూన్

ఈ ఏడాది తొలి పౌర్ణమిన సూపర్ మూన్ ఎల్లుండి కనువిందు చేయనుంది. జనవరి 3న సాయంత్రం 6 గంటలకు చంద్రుడు మరింత పెద్దగా కనిపించనున్నాడు. సాధారణం కంటే 15శాతం బిగ్గర్గా 30శాతం ప్రకాశవంతంగా దర్శనమిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగా చూడవచ్చు. కాగా సూపర్మూన్ గత 4 నెలలుగా వరుసగా కనిపిస్తుండటం గమనార్హం. OCT, NOV, DECలోనూ కనువిందు చేసింది. ఇక ఈసారి సూపర్ మూన్ చూడటం మిస్ అయితే నవంబర్ వరకూ ఆగాల్సిందే.
News January 1, 2026
అందుకే దాస్పై ఆరోపణలు: CM రేవంత్

TG: పాలమూరు-RR ప్రాజెక్టు వివాదం వేళ వార్తల్లో నిలిచిన ఇరిగేషన్ సలహాదారు <<18689807>>ఆదిత్యనాథ్<<>> దాస్ గురించి CM రేవంత్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై ఆయనకు అవగాహన ఉండటంతోనే AP నుంచి తీసుకొచ్చామన్నారు. ఆయనది అటు ఏపీ, ఇటు తెలంగాణ కాదని, దాస్ బిహార్కు చెందినవాడని తెలిపారు. కేసీఆర్, హరీశ్ రావు దొంగతనాన్ని బయటపెడతాడనే భయంతోనే ఆయనపై BRS నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.


