News July 15, 2024
2030 నాటికి ₹580L cr రిటైల్ డిజిటల్ చెల్లింపులు

దేశంలో 2022లో ఇ- కామర్స్ మార్కెట్ ₹6.5L cr ఉండగా, 2030 నాటికి 21% వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. రిటైల్ డిజిటల్ చెల్లింపులు 2023-24లో దాదాపు ₹300L cr ఉండగా, 2030కి ₹580L crకు చేరొచ్చని తెలిపింది. 1965-1996 మధ్య జన్మించిన వారు 72% డిజిటల్ చెల్లింపులే చేస్తున్నారని పేర్కొంది. అమెజాన్ పే, కార్ని సంయుక్తంగా 120 నగరాల్లో ‘హౌ అర్బన్ ఇండియా పేస్’ పేరుతో ఈ అధ్యయనం చేసింది.
Similar News
News February 2, 2026
ఇందిరమ్మ ఇళ్లు.. 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం నిధులు!

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PMAY) పథకం కింద 2026-27 FYలో 4.13 లక్షల ఇళ్లకు నిధులు రానున్నట్లు అధికారులు తెలిపారు. పీఎంఏవై కింద పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, గ్రామాల్లో రూ.72 వేలు అందించనుంది. కాగా ఈ పథకానికి మొత్తం రూ.5 లక్షల నగదు విడతల వారీగా అందజేస్తున్న సంగతి తెలిసిందే.
News February 2, 2026
173 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News February 2, 2026
మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లివే..

మహిళలకు వచ్చే క్యాన్సర్ వ్యాధుల్లో సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్. వీటితోపాటు యూట్రస్ క్యాన్సర్, అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.


